⇒ రెండో రోజు వర్షం అంతరాయం
⇒ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 289/3
⇒ విండీస్తో రెండో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో శనివారం రోజు మొత్తంలో కేవలం ఆరు ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ డు ప్లెసిస్ (230 బంతుల్లో 103; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించడంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 94 ఓవర్లలో 3 వికెట్లకు 289 పరుగులు చేసింది.
ఆమ్లా (23 బ్యాటింగ్), డివిలియర్స్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 270/2 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన డు ప్లెసిస్... టేలర్ తొలి బంతినే బౌండరీకి తరలించి శతకం పూర్తి చేశాడు. కానీ తర్వాతి బంతికే రామ్దిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన డివిలియర్స్, ఆమ్లాతో కలిసి నెమ్మదిగా ఆడాడు. చివరకు ఆరు ఓవర్ల తర్వాత మరోసారి వాతావరణం మేఘావృతం కావడంతో మ్యాచ్ను నిలిపి వేశారు. టేలర్, పీటర్స్, గాబ్రియెల్ తలా ఓ వికెట్ తీశారు.
ఆరు ఓవర్ల ఆటే...
Published Sun, Dec 28 2014 1:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement