సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబువి దుర్మార్గపు రాజకీయాలని అందుకే ఆయనకు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విశాఖ జిల్లా భీమిలిలో దివీస్ లేబొరేటరీ సమీపంలో ఏడు గ్రామాల్లో 7 వేల మందికి రూ.40 లక్షలతో సమకూర్చిన నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజానాయకుడంటే కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలకు పారిపోరన్నారు. చంద్రబాబు తెలంగాణకు వెళ్లిపోవడాన్ని గుర్తు చేశారు.
కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది త్యాగాలు గుర్తించకుండా ప్రభుత్వంపై బురదచల్లే నీచరాజకీయాలు మానుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి ఆయా వర్గాలకు న్యాయం జరగాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. కాగా, నగరంలోని వెంకోజీపాలెంలో ప్రగతి భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు, వలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, జీవీఎంసీ ఉద్యోగులకు మాస్క్లు, గ్లౌజ్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
చంద్రబాబువి దుర్మార్గపు రాజకీయాలు
Published Wed, Apr 8 2020 4:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
Advertisement