కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకారి
మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి,అమరావతి: కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ విపక్ష నేత చంద్రబాబు అని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అత్యంత క్లిష్ట సమయంలో బాధ్యతను మరిచి నీచ బుద్ధి ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► కరోనా కట్టడిలో ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే ముందుంది.
► రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గానికి కనీసం 100 బెడ్లతో క్వారంటైన్ భవనాలు ఏర్పాటు చేశాం.