టీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయింపుల పర్వం: చాడ | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయింపుల పర్వం: చాడ

Published Mon, Oct 29 2018 1:55 AM

Chada Venkat Reddy Comments on TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయింపుల పర్వం మొదలైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ వచ్చిన అహంకారంతో అన్ని పార్టీల్లో ఫిరాయింపులు ప్రోత్సహించిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌..ప్రస్తుతం ఆయారాం గయారాంలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్, పద్మా దేవేందర్‌రెడ్డిలతో సహా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను వారి నియోజకవర్గాల్లో ప్రజలు నిలదీస్తున్నారన్నారు.

ప్రజా కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయని, నీళ్లు, కరెంటు రావని తప్పుడు ప్రచారం చేసినా..ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement