తలపెకైత్తి చూస్తే.. గాల్లో జామ్జామ్ మంటూ దూసుకెళ్తున్న మినీ పాడ్లు.. ట్రాఫిక్ జామ్లు లేవు.. కాలుష్యం గోల లేదు.. డ్రైవర్ల అవసరమే లేదు.. అంతా ఆటోమెటిక్.. ఎక్కడ.. అమెరికానా.. ఇంగ్లండ్నా.. ఎక్కడో కాదు.. ఇక్కడే.. మన ఢిల్లీలోనే.. త్వరలో మన దేశ రాజధానిలో ఇలాంటి సీన్లు చాలా కామన్ కానున్నాయి.. మెట్రో చూసేశాం.. ఇక మెట్రినో చూడ్డానికి సిద్ధమైపోండి..
ఏమిటీ మెట్రినో..
ఇది డ్రైవర్ అవసరం లేని ప్రజా రవాణా వ్యవస్థ. బస్సులు, మెట్రో ఎలాగో.. ఇదీ అలాగే.. ఢిల్లీలో ట్రాఫిక్తోపాటు కాలుష్యమూ ఎక్కువ. వీటికి చెక్ పెట్టడానికి కేంద్రం తెస్తున్నదే ఈ పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్(పీఆర్టీ) సిస్టం. ఢిల్లీలోని దౌలాకువా ప్రాంతం నుంచి హర్యానాలోని మనేసర్ వరకూ అంటే దాదాపు 70 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించనున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ-గురుగ్రామ్ బోర్డర్ నుంచి సోహ్నా రోడ్ వరకూ 13 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పైలట్ ప్రాజెక్టు కోసం రూ.850 కోట్లు అవుతుందని అంచనా. మొత్తం ప్రాజెక్టు పూర్తికి రూ.4 వేల కోట్లు అవుతుంది.
ఎలా పనిచేస్తుంది?
మెట్రినో కరెంటుతో పనిచేస్తుంది. సెక్యూరిటీ కెమెరాల ద్వారా దీని పనితీరును సమీక్షిస్తుంటారు. మెట్రినోలో మొత్తం 1,100 మినీ పాడ్లు ఉంటాయి. ఒకదాంట్లో ఐదుగురు ప్రయాణించవచ్చు. రోప్వేలాంటి దాని ఆధారంగా ఇది ప్రయాణిస్తుంది. పైనుంచి వెళ్లే ఇవి.. స్టేషన్ వచ్చేసరికి.. కిందకు దిగుతాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
మరి టికెట్ రేటో..
సాధారణ రవాణా వ్యవస్థల్లో ఎంత ధర ఉంటుందో దీనికీ అంతే ఉంటుందని చెబుతున్నారు. మెట్రోతో పోలిస్తే.. తక్కువ ఉండొచ్చని కూడా అంటున్నారు. ఎందుకంటే.. మెట్రో నిర్మాణం కోసం కిలోమీటరుకు రూ.250 కోట్ల దాకా ఖర్చయితే.. మెట్రినోలో కిలోమీటరుకు రూ.50-60 కోట్ల వరకూ ఖర్చవుతుంది. దీని వల్ల రేట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మెట్రినో టెండర్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. మరో రెండు నెలల్లో పైలట్ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించారు కూడా. సో.. బీ రెడీ ఫర్ మెట్రినో..
మెట్రో కాదు.. మెట్రినో
Published Mon, Jun 27 2016 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement