టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమైంది. ఇటీవల తన సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షితో భారీ వసూళ్లు సాధించిన మహేష్ 26వ సినిమాగా డిఫరెంట్ మూవీని ఎంచుకున్నాడు. వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను ప్రారంభించాడు మహేష్.
ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓపెనింగ్ ఈవెంట్ను నిర్వహించారు.
దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సెంటిమెంట్ను ఫాలో అవుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా మహేష్ హాజరు కాలేదు.