కేప్టౌన్: దక్షిణాఫ్రికాలో కోమో అనే అమ్మాయిని కామోద్రేకులు రేప్ చేసి, హత్య చేశారనే వార్తా కథనం మూడు రోజులుగా సోషల్ వెబ్సైట్ ‘లో సంచలనం సృష్టించింది. ఈ వార్తను చదివిన యూజర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. సానుభూతి కురిపించారు. అయ్యో పాపం! అంటూ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు సంతాపం కూడా ప్రకటించారు. దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ పత్రికలు కూడా ఆ వార్తా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. యవ్వన ప్రాయంలోనే ఓ యువతి జీవితంతో ఆడుకున్నారని, అన్యాయంగా ఆమె జీవితాన్ని అర్ధంతరంగా ముగించారని వ్యాఖ్యలు చేశాయి. కోమో నీకు అశ్రు అంజలి ఘటిస్తున్నామంటూ ఎక్కడిలేని జాలి కురిపించాయి. దక్షిణాఫ్రికా మహిళా విభాగం కూడా తీవ్రంగానే స్పందించింది. మహిళలకు, పిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగిన ఎదురించండూ పిలుపు కూడా ఇచ్చింది. చివరకు అది కట్టుకథ అని తేలింది.
సోషల్ మీడియా, ముఖ్యంగా ఫేస్బుక్లో తప్పుడు వార్తలు, వార్తా కథనాలు వాస్తవాలకన్నా వేగంగా ప్రచారం అవుతున్నాయంటూ ఇటలీ సోషల్ సైన్స్ విభాగానికి చెందిన నిపుణులు ఓ అధ్యయనంలో వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలోనే ట్విట్టర్లో కూడా ఓ కట్టుకథ ప్రచారం అవడం ఆందోళనకరమైన అంశం. ఎట్ ది రేట్ ఆఫ్ జస్ట్కుతి అనే ట్విట్టర్ యూజర్ తన స్నేహితురాలు కామోను అన్యాయంగా రేప్ చేసి హత్య చేశారన్న వార్తాకథనాన్ని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాతోపాటు ప్రింట్ మీడియా కూడా ఆ కథనానికి ప్రాధాన్యత నిచ్చి తప్పులో చేతులు కాల్చుకున్నాయి. తాను పోస్ట్ చేసిన వార్తా కథనం ఓ కాపీ కథని కుతి ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు వెల్లడించింది. నెట్లో ఓ కథను చదివిన తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, దేశం విడిచి పారిపోదామనుకున్నానని, వ్యూయర్ల స్పందనను కూడా తెలుసుకునేందుకు దాన్ని కాపీ కొట్టి క్యారెక్టర్లను మార్చేసి ఈ కొత్త కథను సోషల్ మీడియా ముందుంచానని తెలిపింది. కాపీ కథలను రాయడం తనకు అలవాటని కూడా తెలిపింది.
తాను రాసిందీ, పోస్ట్ చేసిందీ కట్టుకథే అయినప్పటికీ సమాజంలో ఆడవాళ్ల పరిస్థితి ఇంతే దారుణంగా ఉందని, అందరిని తప్పుదోవ పట్టించినందుకు తనను క్షమించాలని, ఏదేమైనా ఇది మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసిందని సమర్థించుకుంది. తప్పుడు వార్తాకథనాన్ని ప్రచురించిన కొన్ని పత్రికలు కూడా జరిగిన పొరపాటుకు మరుసటి రోజు వివరణ ఇచ్చుకున్నాయి. ‘మా ముఖాలు సిగ్గుతో కందిపోయాయి. పొరపాటును గ్రహించాం. నిజానిజాలను నిర్ధారించుకోకపోవడానికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. ఇది నిజంగా జర్నలిజం కాదు. ఇది మాకు, మా పరిశ్రమకు గుణపాఠం’ అని ఓ పత్రిక సంపాదకుడు కెవిన్ రిట్చీ వ్యాఖ్యానించారు.
కుతిది కట్టుకథే కావచ్చు. మహిళలు, పిల్లలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసమాత్రం అక్షరాల నిజమని, సమాజంలో కామో లాంటి వాళ్లు ఎందరో ఉన్నారని ట్విట్టర్ మహిళా విభాగం వ్యాఖ్యానించింది. మరి కన్నీటి స్పందనల్లో కూడా ఎన్ని కట్టుకథలు ఉన్నాయో!
కన్నీళ్లు పెట్టించిన కట్టు కథ
Published Wed, Jan 13 2016 7:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement