- పార్టీ నేతలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
- సర్కారు నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- ఆరు జిల్లాల నేతలతో ‘గడప గడపకూ వైఎస్సార్’ పురోగతిపై సమీక్ష
- కార్యక్రమం అమలు తీరుపై సంతృప్తి
- మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సారవంతమైన భూములను బలవంతంగా లాక్కుంటున్న టీడీపీ ప్రభుత్వ భూదాహాన్ని ప్రజల్లో ఎండగట్టాలని వైస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదా వరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఆయా జిల్లాల్లో కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. నేతలకు కొన్ని సూచనలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ చంద్రబాబు సర్కారు సాగిస్తున్న నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
అందువల్ల పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రజలకు మరింతగా చేరువ కావడానికి ప్రయత్నించాలని చెప్పారు. ప్రభుత్వ భూ కుంభకోణాలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవం వంటి అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ముఖ్యంగా రైతన్నల ఆర్తనాదాలు ప్రభుత్వం చెవికెక్కడం లేదని దుయ్యబట్టారు. గడప గడపకూ వైఎస్సార కార్యక్రమం పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. కిందిస్థారుు నుంచి కార్యకర్తలను కలుపుకొని పోవాలని సూచించారు. పార్టీ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలన్నారు.
ఆరోగ్యశ్రీని నీరు గారుస్తున్నారు
పేద రోగుల పాలిట సంజీవని అరుున ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 9వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాల్లో నిరుపేద రోగులను, సాధారణ ప్రజలను భాగస్వా ములను చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులను నిలిపివేయడం దారు ణమని అన్నారు. సమీక్షా సమావేశంలో వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసనమండలిలో పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్చంద్రబోస్, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజు తదితర నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూదాహాన్ని ఎండగట్టండి
Published Tue, Dec 6 2016 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement