చోరీ కేసులో నలుగురి రిమాండ్ | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నలుగురి రిమాండ్

Published Sat, Aug 27 2016 6:26 PM

four arrested in robbery case, says DSI naveenBabu

బోడుప్పల్:  ఇళ్లల్లో చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న నలుగురు యువకులను శనివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్‌ఐ నవీన్‌బాబు సమాచారం మేరకు... బోడుప్పల్‌కు చెందిన ఉప్పరి బాబుసాయి(18), కె.సాయితేజ్ (19), డి.నరేష్(18), చెంగిచర్లకు చెందిన ఎం.కృష్ణ(18) బోడుప్పల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు.

వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తాము ఈనెల 24న బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో తన్నీరు రమణమ్మ ఇంట్లో మూడు సెల్‌ఫోన్‌లు, ఏటీఎం కార్డులు, ఇతర వస్తువులు దొంగలించినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement