సతీష్ చందర్కు తాపీ పురస్కారం
సతీష్ చందర్కు తాపీ ధర్మారావు పురస్కార ప్రదాన సభ అక్టోబర్ 15న ఉదయం 10 గంటలకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజ్, హైదరాబాద్లో జరగనుంది. కె.రామచంద్రమూర్తి, జస్టిస్ చంద్రకుమార్, ఎస్వీ సత్యనారాయణ, నందిని సిధారెడ్డి, ఏటుకూరి ప్రసాద్, విమలా సోహన్, సామల రమేశ్బాబు పాల్గొంటారు.
హీరాలాల్ యాదిలో
హీరాలాల్ మోరియా యాదిలో సాహిత్య సభ అక్టోబర్ 14న సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలోని కవితా డిగ్రీ, పీజీ కళాశాలలో జరగనుంది. వంశీకృష్ణ, నియోగి, పోతగాని సత్యన్నారాయణ పాల్గొంటారు. కవి సమ్మేళనం ఉంటుంది. నిర్వహణ: తెలంగాణ రచయితల వేదిక–ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు.
అంగారస్వప్నం ఆవిష్కరణ
ఊర్మిళ కవితాసంపుటి అంగారస్వప్నం ఆవిష్కరణ అక్టోబర్ 15న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ గోల్డెన్ త్రెషాల్డ్లో జరగనుంది. నిర్వహణ: ‘ప్రేమలేఖ’.
ముందడుగు ఆవిష్కరణ
అడిగోపుల వెంకటరత్నమ్ 20వ కవితా సంపుటి ‘ముందడుగు’ ఆవిష్కరణ అక్టోబర్ 15న ఉదయం 10:30కు హోటల్ ఐలాపురం, విజయవాడలో జరగనుంది. ఆవిష్కర్త: మండలి బుద్ధప్రసాద్. సోమేపల్లి వెంకటసుబ్బయ్య, రావెల సాంబశివరావు, చెవుల కృష్ణాంజనేయులు, డి.శమంతకమణి, పొన్నూరు వెంకట శ్రీనివాసులు పాల్గొంటారు. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం.