రారండోయ్
‘విసిసిట్యూడ్స్ ఆఫ్ ద గాడెస్’, ‘బుద్ధిజం ఇన్ ద కృష్ణా రివర్ వేలీ’ గ్రంథాల రచయిత్రి ప్రొఫెసర్పద్మ హోల్ట్ విజయవాడ రాక సందర్భంగా, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 16న సాయంత్రం 5 గంటలకు మధుమాలక్ష్మి చాంబర్స్లో జరిగే ఈ కార్యక్రమంలో– సాయి పాపినేని ‘ఆంధ్రనగరి’ నేపథ్యంలో తెలుగులో చారిత్రక కాల్పనిక సాహిత్యపు ఆవశ్యకతపై పద్మ ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి: సజ్జల రామకృష్ణారెడ్డి.
► మధురాంతకం నరేంద్ర కథల సంపుటి ‘నాలుగుకాళ్ల మండపం’ ఆవిష్కరణ సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటలకు తిరుపతి, ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: కొలకలూరి ఇనాక్. జి.ఎం.సుందరవల్లి, పి.శ్రీధర రెడ్డి, వాసిరెడ్డి నవీన్, మహమ్మద్ ఖదీర్బాబు, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, బి.తిరుపతి రావు పాల్గొంటారు. నిర్వహణ: ఆంగ్ల, తెలుగు శాఖలు, ఎస్వీ యూనివర్సిటీ; ఆన్వీక్షికి పబ్లిషర్స్.
► సెప్టెంబర్ 22న ఉదయం 9:30కు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని విద్యానికేతన్ పాఠశాలలో జరిగే రాజాం రచయితల వేదిక సమావేశంలో ‘గ్రామ నామ విజ్ఞానం’ (టొపోనమి) అంశంపై వాండ్రంగి కొండలరావు ప్రసంగిస్తారు.
► డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి కుటుంబీకులు 2009 నుండి ఇస్తోన్న మల్లెమాల పురస్కారాన్ని ఈ ఏడాది రచయిత షేక్ హుస్సేన్ సత్యాగ్నికి సెప్టెంబర్ 22న ఉదయం సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ప్రదానం చేయనున్నారు.
► నాటక, నవల, కథా రచయిత, నృత్యరూపకాల స్రష్ట పోలవరపు కోటేశ్వరరావు సమగ్ర సాహిత్యాన్ని లోక్నాయక్ ఫౌండేషన్ ప్రచురించనుంది. అలభ్య రచనలను పంపాల్సిందిగా ఫౌండేషన్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరుతున్నారు. చిరునామా: 9–28–4, బాలాజీ నగర్, విశాఖపట్టణం – 530003. ఫోన్: 9849067343.
మెయిల్: ylp@1953@gmail.com
► జాషువా జయంతి సందర్భంగా ఆయన అభిమానులు ‘జాషువా సాహిత్యం మానవతా దృక్పథం’ అంశం మీద వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నారు. మొదటి, రెండవ బహుమతులు రూ. 5 వేలు, 3 వేలు. సెప్టెంబర్ 22లోపు పంపాల్సిన మెయిల్. drfaustus999@gmail.com వివరాలకు: పచ్చల రాజేశ్, ఫోన్: 8331823086
సంబంధిత వార్తలు