'కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదు' | Sakshi
Sakshi News home page

'కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదు'

Published Mon, Mar 31 2014 2:36 PM

there is no place for hard workers in tdp, says soma sekhar rao

కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదని ఆ పార్టీ మాజీ నాయకుడు కరణం సోమశేఖర్ రావు మండిపడ్డారు. ఆ పార్టీ అంతా కార్పొరేట్ మయంగా మారిపోయిందని విమర్శించారు. చంద్రబాబుది వైఎస్‌లా నమ్మినవారిని ఆదరించే మనస్తత్వం కాదని, తెలంగాణలో టీడీపీ కనుమరుగవడం ఖాయమని ఆయన అన్నారు.

చంద్రబాబు ఈ ఎన్నికల్లో అమలుకు ఆచరణసాధ్యం కాని హామీలనిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు విధానాలు నచ్చకే తాను ఆ పార్టీని వీడుతున్నానని చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని కరణం సోమశేఖర్‌రావు వెల్లడించారు.

Advertisement
Advertisement