నరసన్నపేట, న్యూస్లైన్ : నరసన్నపేట నియోజకవర్గం పరిధిలో సోమవారం సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ నిర్వహించిన రోడ్షో నిర్దేశిత సమయానికి మించి కొనసాగింది. ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ప్రతినిధి శాస్త్రి్గ రిటర్నింగ్ అధికారి తనూజారాణి, ఎస్పీ నవీన్ గులాఠీలకు ఫిర్యాదు చేశారు. నిర్దేశిత సమయం తర్వాత కూడా రోడ్షో కొనసాగినా కాన్వాయ్ వెంట ఉన్న ఎన్నికల పరిశీలకులు పట్టించుకోకపోవటం గమనార్హం. వాస్తవానికి బాలకృష్ణ రోడ్షోను సాయంత్రం 4 గంటలకల్లా ముగించాలి. కానీ 4.20 గంటల వరకు ఉర్లాంలో కొనసాగింది.
రోడ్షో సమయానికి మించి కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని మధ్యాహ్నం 3 గంటలకే కృష్ణదాస్ ప్రతినిధి శాస్త్రి ఆర్వో తనూజారాణికి తెలిపారు. బాలకృష్ణ కాన్వాయ్ వెంట ఇద్దరు ఎన్నికల పరిశీలకులు ఉన్నారని, గడువులోగా రోడ్షో ముగిసేలా వారు చూస్తారని ఆమె చెప్పారు. 4.20 గంటలకు కూడా రోడ్షో కొనసాగటంతో ఈ విషయాన్ని శాస్త్రి ఆర్వో, ఎస్పీలకు తెలిపారు. వారి సూచన మేరకు స్పెషల్ బ్రాంచ్ సీఐ సతీష్కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ విషయమై శాస్త్రి విలేకరులతో మాట్లాడుతూ సమావేశ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నామని, వారి వివరణ వచ్చాక కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆర్వో తమకు చెప్పారని వెల్లడించారు. కోడ్ ఉల్లంఘనపై వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు.
సమయానికి మించి రోడ్షో
Published Tue, Apr 22 2014 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement