ప్రొద్దుటూరు, న్యూస్లైన్: ప్రొద్దుటూరు తెలుగుదేశం టికెట్పై నెలకొన్న సందిగ్ధత తొలగలేదు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి బీ ఫాం కోసం కార్యకర్తలతో కలిసి గురువారం రాత్రి హైదరాబాద్కు వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసి బీ ఫాం తెచ్చుకునేందుకు ఆయన వెళ్లారు. ప్రొద్దుటూరు టికెట్ కేటాయింపుపై చంద్రబాబు నాయుడు ట్విస్ట్ పెట్టారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత బీ ఫాం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
అయితే ఇందుకు విరుద్ధంగా జరిగింది. వాస్తవానికి ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి పార్టీ కండువాతో గురువారం మధ్యాహ్నం స్థానిక తహశీల్దార్కార్యాలయంలో లింగారెడ్డి నామినేషన్ వేశారు. బీ ఫాం లేకపోవడంతో అధికారులకు సమర్పించలేదు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడును కలిసిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆయన నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. అయితే లింగారెడ్డికి బీ ఫాం ఇవ్వకుండా రాజ్యసభ సభ్యుడు రమేష్నాయుడుకు చంద్రబాబు బీఫాం అప్పగించినట్లు తెలుస్తోంది. రమేష్ నాయుడు మాత్రం వరదరాజులరెడ్డి వైపు మొగ్గుచూపుతుండటంతో లింగారెడ్డి వర్గీయులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీంతో పార్టీ అధ్యక్షునితో నేరుగా మాట్లాడి బీ ఫాం తెచ్చుకునేందుకు లింగారెడ్డి హైదరాబాద్ వెళ్లారు.టికెట్ విషయంలో పార్టీ అధ్యక్షునితో తాడోపేడో తెల్చుకోవాలనే ఉద్ధేశంతో లింగారెడ్డి ఉన్నట్లు తులేస్తోంది. వాస్తవానికి బుధవారం రాత్రి కూడా లింగారెడ్డి, వరదరాజులరెడ్డిలు నారా లోకేష్ సభకు హాజరై మాట్లాడారు. టికెట్ కేటాయింపులో ఇరువురి మధ్య పోటీ పెరగడంతో వరదరాజులరెడ్డి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కారణంగానే లింగారెడ్డి ఒంటరిగా నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. జిల్లాలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు. నామినేషన్ దాఖలకు శనివారం ఒక్కరోజే గడువు ఉన్నా ఇంత వరకు ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఈ విషయం చర్చాంశనీయంగా మారింది. లింగారెడ్డి నామినేషన్ దాఖలు చేసినా టికెట్ మాత్రం తమకే వస్తుందని వరదరాజులరెడ్డి వర్గీయులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో చివరి వరకు టికెట్ ఎవ్వరికి దక్కుతుందనే విషయం అర్థం కావడం లేదు. మరో వైపు శనివారం వరదరాజులరెడ్డి కూడా నామినేషన్ వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రొద్దుటూరు టీడీపీ టికెట్పై తొలగని సందిగ్ధత
Published Fri, Apr 18 2014 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement