సాక్షి, ముంబై: ముంబైలోని నాలుగు లోక్సభ నియోజక వర్గాల్లో మొత్తం 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నాలుగు లోక్సభ నియోజక వర్గాల్లో మొత్తం 101 మంది నామినేషన్లు వేశారు. అందులో తొమ్మిది మంది ఉపసంహరించుకున్నారు. 17 మంది అభ్యర్థుల నామినేషన్లు రద్దు కావడంతో 75 మంది బరిలో మిగిలారు. ఉత్తర ముంబై, ఉత్తర-మధ్య ముంబై నియోజక వర్గాల నుంచి 21 మంది, ఈశాన్య ముంబై నుంచి 19 మంది, వాయవ్య ముంబై నుంచి 14 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలాఉండగా ఆదివారం నుంచి ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది? బూత్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి.
ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు...
15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఉత్తర ముంబై, ఉత్తర -మధ్య ముంబై, ఈశాన్య ముంబై నియోజక వర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రెండు చొప్పున ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 15 కంటే తక్కువ అభ్యర్థులున్న వాయవ్య ముంబై నియోజక వర్గంలో ఒకే ఈవీఎం ఉంటుంది. వచ్చే నెల 16వ తేదీన ఉత్తర ముంబై, వాయవ్య ముంబై, ఉత్తర-మధ్య ముంబై నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు గోరేగావ్లోని నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో, ఈశాన్య ముంబై నియోజక వర్గం ఓట్ల లెక్కింపు విక్రోలిలోని గోద్రెజ్ పాఠశాలలో జరుగుతుంది. ఇదిలాఉంచితే ఉత్తర ముంబై నియోజకవర్గంలో పోలీసులు రెండు కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎవరికి లాభించేనో?
తొలి విడతలో విదర్భలోని 10 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరుగుదల ఎవ రికి లాభించనుందనే విషయమై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇందువల్ల తమ అభ్యర్థులకే ప్రయోజనం చేకూరుతుందంటూ ప్రజాస్వామ్య కూటమి, మహాకూటమితోపాటు ఇతర పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పక్షాలపై వ్యతిరేకత కారణంగా ప్రతిపక్షాలకు లబ్ధి చేకూరుతుందంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇలాగే జరిగే అవకాశముందంటున్నారు. ఇదిలాఉంచితే ఈసారి మైనారిటీ ఓటర్ల శాతం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో వీరు ఎవరివైపు మొగ్గుచూపారనే విషయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. 2009 ఎన్నికల్లో విదర్భలోని 10 లోక్సభ నియోజకవర్గాల్లో 50 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి సుమారు 62 నుంచి 65 శాతానికి పోలింగ్ పెరిగింది. వీరిలో అన్ని వర్గాల ఓటర్లున్నారు. దీంతో ఎవరికి లాభం చేకూరనుందనేది వేచిచూడాల్సిందే.
పోలింగ్ శాతం వివరాలు..
లోక్సభ 2014 2009
బుల్డాణా 58.66 61.6
అకోలా 65 49
అమరావతి 65 51
వర్ధా 61 52
రామ్టెక్ 62 50.8
నాగపూర్ 59 43.4
గ డ్చిరోలి 65 65
చంద్రాపూర్ 63 58.48
యావత్మాల్ 60 54.5
‘ముంబై’ బరిలో 75 మంది
Published Fri, Apr 11 2014 10:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement