♦ ఏ–1 వాంగ్మూలం మేరకే ఏ–4, ఏ–5, ఏ–6లపై కేసులు
♦ మాకు ఎవరి నుంచి ఒత్తిళ్లు లేవు సీపీ సుధీర్బాబు
టీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేటర్ అనిశెట్టి మురళీమనోహర్ హత్య వ్యక్తిగత కక్షలతోనే జరిగింది. ఈ హత్య కేసులో విచారణ చేపట్టిన అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవు. కేసు విచారణ పూర్తిగా ప్రొఫెషనల్గా సాగుతోంది. నేరస్తులు కాని వారిని ఈ కేసులో పెట్టాలనే
ఉద్దేశం పోలీసు శాఖకు లేదు. – జి.సుధీర్బాబు, పోలీస్ కమిషనర్
వరంగల్:
హన్మకొండ కుమార్పల్లిలో ఈనెల 13వ తేదీన జరిగిన టీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేటర్ అనిశెట్టి మురళీమనోహర్ హత్య వ్యక్తిగత కక్షలతోనే జరిగిందని సీపీ సుధీర్బాబు తెలిపారు. బుధవారం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేటర్ మురళి హత్యపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పష్టత ఇచ్చేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుతెలిపారు. మురళి హత్య కేసుపై విచారణ చేపట్టిన అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. ఈ హత్యపై ఇచ్చిన ఫిర్యాదులో కేవలం ముగ్గురు పేర్లు మాత్రమే సూచించారని తెలిపారు.
హత్య అనంతరం పోలీస్స్టేషన్లో లొంగిపోయిన నిందితుల్లో మొదటి నిందితుడు ఎ–1 ఇచ్చిన వాంగ్మూలంతోనే ఈ హత్యకు మరికొద్ది మంది సహకరించారని, వారే తనకు ఆయుధాలు అందజేసినట్లు చెప్పినట్లు వివరించారు. ఎ–1 నిందితుడు విచారణలో తెలిపిన వివరాల ఆధారంగానే రిమాండ్ సీడీలో ఎ–4, ఏ–5, ఏ–6 పేర్లను చేర్చినట్లు తెలిపారు. ఎ–1 ముద్దాయి విచారణ విషయాల అధారంగానే రిమాండ్ రిపోర్ట్లో పేర్ల నమోదు చేసి కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో రాసినట్లు తెలిపారు. ఎ–4, ఎ–5, ఎ–6 నిందితులను ఇప్పటి వరకు ఆరెస్టు చేయలేదన్నారు. మురళి హత్య కేసులో తన ఇంట్లో రికార్డు అయిన సీసీ ఫుటేజీ, నిందితుల వాంగ్మూలంతో రిమాండ్ రిపోర్టు తయారు చేసి కోర్టుకు సమర్పించామని సీపీ తెలిపారు. సమావేశంలో సెంట్రల్జోన్ డీసీపీ వేణుగోపాల్రావు, హన్మకొండ ఏసీపీ మురళీధర్ పాల్గొన్నారు.
సీసీ ఫుటేజీల సీడీ, వాంగ్మూలం కోర్టుకు సమర్పణ
కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం సాయంత్రం పోలీసులు అనిశెట్టి మురళి ఇంటి వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. మురళీ హత్యకు గంట ముందు, తర్వాత జరిగిన విషయాలను పరిశీలించారు. ఇందులో గంటకు ముందు సంఘటన స్థలం వద్దకు వెళ్లిన వారి వివరాలు ఉన్నట్లు తెలిసింది. హత్య జరిగే సమయంలోపై నుంచి దిగుతున్న వ్యక్తులు.. మెట్లు ఎక్కుతున్న వారిని చూసి పలకరించినట్లు సైతం ఇందులో రికార్డైనట్లు సమాచారం. హత్య చేసేందుకు వెళ్లిన వారితో పాటు హత్యకు ఉపయోగించిన కత్తులు ఉన్న బ్యాగు విజువల్స్ రికార్డైనట్లు తెలిసింది. మురళీ హత్య చేసిన అనంతరం కత్తిని తిప్పుతూ కింది దిగిన దృశ్యాలు చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. ఈ సీసీ పుటేజీల సీడీతో పాటు పోలీస్స్టేషన్లో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిసింది.
వ్యక్తిగత కక్షలతోనే మురళి హత్య
Published Thu, Jul 20 2017 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
బాబుకు గుర్తు గుబులు
హరీష్ రావు ఎమోషనల్
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
Advertisement