రైతు బాధ చూడలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం! | Sakshi
Sakshi News home page

రైతు బాధ చూడలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం!

Published Mon, Aug 17 2015 4:39 PM

farmer krishnaiahs wife attempt suicide with two childrens, she is died

నిండ్ర: చిత్తూరు జిల్లా నిండ్రలో ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. తొలుత పురుగు మందు తాగిన తల్లి.. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలకూ ఇచ్చింది.  సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో తల్లి మాదవి, కుమార్తె శరణ్య మృతి చెందగా, మరో కుమార్తె గాయత్రి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళితే.. బీసీ కాలనీకి చెందిన కిష్ణయ్య రైతు. పంట పొలాల సాగుకోసం 12 సార్లు బోర్లు వేశాడు. అయితే అన్ని నిరుపయోగం కావడంతో అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఆ రైతు.. రుణమాఫీ వర్తించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందేవాడు. కృష్ణయ్య ఇబ్బందులు చూడలేక భార్య తన పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో భార్య, ఒక కూతురి మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement