సాక్షి, కళ్యాణదుర్గం రూరల్: అతివేగం కొంపముంచింది.. ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సును దివాకర్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 9.20 గంటలకు కళ్యాణదుర్గం డిపో నుంచి ఆర్టీసీ బస్సు అనంతపురం బయల్దేరింది. గోళ్ల గ్రామం వద్దకు చేరుకోగానే ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో ముందు వైపు కాస్త నెమ్మదిగా వెళ్లింది. అయితే అదే సమయంలో వెనుక వైపు అతి వేగంగా వచ్చిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక వైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. వెనుకవైపున్న ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. దివాకర్ బస్సులో ముందు వైపు కూర్చున్న గోళ్లకు చెందిన మూలప్ప, ఐదుకల్లుకు చెందిన భవాని దంపతులు, రాయలప్పదొడ్డికి చెందిన లక్ష్మమ్మ, గోనబావికి చెందిన సంజీవప్ప, చిన్న హనుమంతు, మాకొడికి గ్రామానికి చెందిన ధనుంజయ, యర్రమలేపల్లికి చెందిన వరదరాజులుకు గాయాలయ్యాయి.
మానవత్వం చాటుకున్న ఆర్డీఓ
అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఆర్డీఓ రామ్మోహన్ గోళ్ల గ్రామం వద్ద జరిగిన ప్రమాదాన్ని చూసి వెంటనే తన వాహనాన్ని ఆపారు. గాయాలతో బాధపడుతున్న వారిలో కొందరిని తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మిగిలిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి చేర్చారు. ఆర్డీఓ మానవత్వం చూసి ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీఎం రామచంద్రనాయుడు, రూరల్ ఏఎస్ఐ ఈశ్వరయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సంఘటన గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న దివాకర్ బస్సు
Published Mon, Aug 19 2019 6:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement