బి.కొత్తకోట :ప్రజా సంకల్పయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. అడుగడుగునా అభిమానులు పోటెత్తుతున్నారు. వినూత్న రీతుల్లో స్వాగతాలు పలుకుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. శ్రీకాళహస్తి మండలం ల్యాంకో సమీపంలోని చెరువులో ఆదివారం వైఎస్ఆర్సీపీ జెండాలతో పలువురు కార్యకర్తలు బోటు విహారం చేస్తూ జననేతకు స్వాగతం పలకడం కన్పించింది.
అభిమానమే నడిపిస్తోంది
ప్రజా సంకల్పయాత్రకు అభిమానులు పోటెత్తుతున్నారు. అభిమాన నేత అడుగులో అడుగేస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం జోగాలకట్టుకు చెందిన వి నారాయణరెడ్డి ఇడుపులపాయ నుంచి జననేత వెంటే నడుస్తున్నారు. ఇచ్చాపురం వరకు అన్న వెంటే ఉంటానని ఆయన అంటున్నారు.
జగన్ సీఎం కావాలని మొక్కుకున్నాం
‘మాది అనంతపురం అర్బన్ ప్రాంతం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మా ఊరోళ్లమంతా కలిసి దేవునికి మొక్కుకున్నాం. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా జననేతతో కలసి నడుస్తున్నా’ అని రాంభూపాల్ రెడ్డి తెలిపారు.