270వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 25 2018 8:22 AM

Ys Jagan 270th Day PrajaSankalpaYatra Begins - Sakshi

సాక్షి, ఎస్‌.కోట (విజయనగరం): ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసి విజయనగరానికి చేరింది. జననేత 270వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొత్త వలస మండలం తుమ్మికపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి అడ్డుపాలెం, నిమ్మపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్‌, గంగుపుడి జంక్షన్‌, లక్కవరపుకోట మండలం మల్లివీడు, గోల్డ్‌స్టార్‌ జంక్షన్‌, జమ్మాదేవి పేట, రంగాపురం క్రాస్‌ మీదుగా రంగరాయపురం వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది.

వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 






 

Advertisement
Advertisement