ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Wed, Oct 23 2019 7:38 PM

Today Telugu News Oct 23rd Sourav Ganguly Takes Oath as BCCIs 39th President - Sakshi

మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ఆదేశించారు. బుధవారం పోషకాహారంపై సీఎం సమీక్ష నిర్వహించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. వివాదాస్పద నేరస్థుల అప్పగింత బిల్లుపై హాంకాంగ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. 

Advertisement
Advertisement