పెందుర్తి నియోజకవర్గంలోకి నేడు ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

పెందుర్తి నియోజకవర్గంలోకి నేడు ప్రజాసంకల్పయాత్ర

Published Tue, Sep 4 2018 7:33 AM

Today Praja Sankalpa Yatra in Pendurthi Constituency - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీ శాసన సభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 254వ రోజు మంగళవారం మాడుగుల నియోజకవర్గం నుంచి పెందుర్తి నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుందని పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురాం వెల్లడించారు. మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం రామచంద్రపురం నుంచి ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర బొట్టవానిపాలెం, కె.సంతపాలెం, చంద్రయ్యపేట, సూదివలస క్రాస్‌ మీదుగా సబ్బవరం మండలం అయ్యన్నపాలెం వద్ద పెందుర్తి నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుందన్నారు. అయ్యన్నపాలెం నుంచి బుదిరెడ్ల పాలెం క్రాస్‌ వద్ద రాత్రి బసకు ఆగుతారన్నారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని చివరిదైన పెందుర్తి నియోజకవర్గంలోకి మంగళవారం అడుగుపెడుతుందన్నారు. పాదయాత్రలో వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని రఘురాం పిలుపునిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement