► రఘువర్మ హత్యకేసులో ముగ్గురి అరెస్టు
► ఏఎస్పీ ఐశ్వర్యరస్తోగి
నర్సీపట్నం: గంజాయి ముఠాల మధ్య విభేదాలే మాదాల రఘువర్మ హత్యకు కారణమని నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. పట్టణ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14న స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన మాదాల రఘువర్మ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు.
నర్సీపట్నం ఎస్సీ కాలనీకి చెందిన మర్రా చిన్ని ఆలియాస్ బోడా, రోలుగుంట మండలం కొత్తపట్నానికి చెందిన శరమండ నారాయణమూర్తి, నర్సీపట్నం మండలం గుర్రందొరపాలెంకు చెందిన వేపాడ రమణను శుక్రవారం అరెస్టు చేశామని చెప్పారు. శరమండ నారాయణమూర్తి కొంత కాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. నారాయణమూర్తి గంజాయి రవాణా చేసిన ప్రతిసారీ రఘువర్మ అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేసేవాడని చెప్పారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని తెలిపారు.
దీంతో రఘువర్మపై నారాయణమూర్తి కక్ష పెంచుకున్నాడని, నర్సీపట్నానికి చెందిన సమీప బంధువైన మర్రా బోడాతో కలిసి రఘువర్మను హత్య చేసేందుకు పథకం రచించాడని తెలిపారు. గొలుగొండ మండలం ఏటిగైరం పేటకు చెందిన రఘువర్మ 14వ తేదీన స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉండడాన్ని చూసి నారాయణమూర్తి బోడాను తీసుకుని వచ్చాడు. రఘువర్మ, నారాయణమూర్తిల మధ్య వాగ్వావాదం జరిగింది. ఇదే సమయంలో మర్రా బోడా కత్తితో రఘువర్మపై దాడి చేసి ఛాతీపై పొడవడంతో రఘువర్మ కుప్పకూలిపోయాడు.
అతనిని ఏరియా ఆస్పత్రి తరలించగా అప్పటికే రఘువర్మ మృతి చెందినట్టు ఏఎస్పీ వివరించారు. రఘువర్మ గతంలో గంజాయి కేసులో నిందితుడని చెప్పారు. రఘువర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మర్రా చిన్ని అలియాస్ బోడాతో పాటు నారాయణమూర్తి, వారికి సహాయంగా మోటార్బైక్పై వచ్చిన వేపాడ రమణను మేజిస్ట్రేటు ఎదుట హాజరు పరుస్తున్నట్టు చెప్పారు. నర్సీపట్నంలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కొంత మంది యువకుల జాబితా తమ వద్ద ఉందని, వారిపై నిఘా పెట్టామన్నారు. గంజాయి అక్రమ రవాణాను సహించేదిలేదని, ఎంతటివారినైనా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ ఎస్.సింహాద్రినాయుడు, ఎస్ఐ అప్పన్న పాల్గొన్నారు..
గంజాయి ముఠాల మధ్య విభేదాల వల్లే హత్య
Published Sat, Aug 19 2017 11:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement