భారమని‘పించనే లేదు’ | Sakshi
Sakshi News home page

భారమని‘పించనే లేదు’

Published Tue, Jul 23 2019 2:08 PM

Person Puts His Mother On His Shoulder In Eluru West Godavari - Sakshi

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): నడవలేని తల్లిని భుజాన వేసుకుని వచ్చాడు ఆ కొడుకు. అతని పేరు వెంకన్న. భీమవరం లెప్రసీ కాలనీలో నివాసం. చేసేది తాపీపని. అతని తల్లి రమణమ్మ వయస్సు 73 ఏళ్లు నడవలేదు. పింఛన్‌ రావడం లేదు. ఎనిమిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం లేదు. మండల కార్యాలయంలో ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా.. స్పందన లేదు. దీంతో స్నేహితుల సలహా మేరకు ఏలూరు కలెక్టరేట్‌కు సోమవారం వచ్చారు. తన తల్లిని భుజాలపై వేసుకుని ఇలా కలెక్టరేట్‌ వద్ద కనిపించాడు. ఇలా భుజాలపై వేసుకున్నావ్‌ ఇబ్బందిగా లేదా అంటే.. భారమనిపించనే లేదని.. పింఛన్‌ వస్తుందని ఆశ అని పేర్కొన్నాడు.

Advertisement
Advertisement