బాబు వచ్చినా జాబు రాలేదన్నా..

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

పెదపూడి ధనలక్ష్మి, పి. గన్నవరం

బాబు వస్తే జాబు వస్తుందంటూ గత ఎన్నికల్లో  ఊదరగొట్టారు. బాబు వచ్చినా తనకు కానీ, తన భర్తకు కానీ జాబు రాలేదంటూ చింతలపల్లి పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి వద్ద పి. గన్నవరానికి చెందిన పెదపూడి ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పుట్టిల్లు చింతలపల్లి వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రగా గ్రామానికి వస్తున్నారని తెలుసుకొని ఆయనను కలసి తన సర్టిఫికెట్లు చూపించింది. తాను ఎమ్మెస్సీ జువాలజీ, భర్త బీఏ, బీఈడీ చేసినట్టు ఆమె తెలిపింది. ఇద్దరికీ ఉద్యోగాలు రాలేదని, తన భర్త టీవీఎస్‌ షోరూంలో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top