తూర్పుగోదావరి : సంక్షేమ సంఘం, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ధవళేశ్వరంఅన్నా! న్యాయమైన డిమాండ్ల కోసం మా రెల్లి కులస్తులం యేళ్ల తరబడి పోరాడుతున్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మా కులస్తులను ఎస్టీల్లో చేర్చాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెల్లి కులస్థులను ఎస్టీల్లోకి చేర్చడమే కాకుండా మా సమస్యలను పరిష్కరించాలి.
పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లను రెగ్యులరైజ్ చేయాలి– కేఎస్ఎన్ మల్లేశ్వరి, క్రాఫ్ట్ టీచర్,తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, గరల్స్ హైస్కూల్
మేం 2014 నుంచి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా విధుల్లో ఉన్నాం. ఉద్యోగ భద్రత లేకుండాపోయింది. జీతాలు 10 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఏడాదిలో రెండు నెలలు జీతాలు లేకుండా జీవిస్తున్నాం. జేఏసీగా ఏర్పడి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.