ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకోండి | Sakshi
Sakshi News home page

ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకోండి

Published Mon, Apr 16 2018 7:24 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా : ‘ఎ.కొండూరు మండలంలో తాగునీటిలో ఫ్లోరైడ్‌ అధికశాతం ఉంది. దీంతో పలువురు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వారిని ఆదుకోవాలి’ అంటూ ఆళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి అనే యువకుడు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. భూగర్భజలాల్లో ఫ్లోరైడ్‌ అధికంగా ఉండటంతో ప్రస్తుతం మండలంలో దాదాపు 300 మంది కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారని తెలిపారు. ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం ఫ్లోరైడ్‌ బాధితులకు నెలకు రూ. 2500 పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోవటం లేదని వాపోయారు. ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించటంతో పాటు కిడ్నీ బాధితుల కోసం ఉచితంగా డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 

Advertisement
Advertisement