ఉద్యోగులను అడ్రస్‌ లేని అమరావతికి పంపి.. | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను అడ్రస్‌ లేని అమరావతికి పంపి..

Published Sun, Apr 9 2017 10:22 AM

ఉద్యోగులను అడ్రస్‌ లేని అమరావతికి పంపి.. - Sakshi

గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఉద్యోగులను హడావుడిగా అడ్రస్‌ లేని అమరావతికి పంపి, తాను మాత్రం కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవడం అన్యాయమని విమర్శించారు.

హైదరాబాద్‌, ఉండవల్లిలోని ప్రభుత్వ అక్రమ నివాసాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు వృధా చేశారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement