వైద్య సిబ్బంది పనితీరుపై మండిపడిన ఎమ్మెల్యే
వాకాడు : ‘ఆసుప్రతి అంటే ఎంత శుభ్రంగా ఉండాలి. ఆసుపత్రికి వస్తే ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యానికి గురయ్యేటట్లు ఉన్నారు. ఇలాగేనా ఆసుపత్రిని ఉంచుకునేది.. ఇదే మీ ఇల్లు అయితే ఇలానే ఉంచుకుంటారా’ అంటూ గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ వైద్య సిబ్బందిపై మండిపడ్డారు. బుధవారం రాత్రి వాకాడులోని ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పుల గది, డ్రస్సింగ్ రూమ్, పడకల వార్డులను పరిశీలించారు. పరిశుభ్రంగా ఉండాల్సిన కాన్పుల గదిలో బల్లపై రక్తపు మరకలు ఉండటంతో ఎమ్మెల్యే సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచకపోతే ఎలా ప్రశ్నించారు.
మరొక సారి ఇలాంటి దుస్థితి ఉపేక్షించేది లేదని ఆయన సిబ్బందిని హెచ్చరించారు. డ్యూటీలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని, పనితీరును మెరుగుపరుస్తామని ఎమ్మెల్యేకు వివరించారు. వాకాడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి కమిటీలను డిసెంబర్ 3వ తేదీన ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పాశం తెలిపారు. వైఎస్సార్సీపీ నేత పాపారెడ్డి మనోజ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు.
అనంతరం వాకాడులోని సెయింట్ జేమ్స్ లూథరన్చర్చి నూతన ప్రతిష్ట మహోత్సవాల్లో ఎమ్మెల్యే సునీల్కుమార్ పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యయ ప్రయాశలు ఓర్చి అధునాతనమైన చర్చి నిర్మాణానికి కృషి చేసిన చర్చి కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. పీసీసీ కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్బాబు, ప్రభుచరణ్, వి.దినకర్బాబు, రాజ్కుమార్, అజయ్కుమార్, ప్రవీణ్కుమార్, రాజరత్నం, మణికుమార్, జోసఫ్, వైఎస్సార్సీపీ నేత నేదురుమల్లి ఉదయశేఖర్రెడ్డి, కె.నందగోపాలరెడ్డి, పాపారెడ్డి మనోజ్కుమార్రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తమ్రెడ్డి, కడూరు భాస్కర్ పాల్గొన్నారు.
ఇలాగేనా ఆసుప్రతిని ఉంచుకునేది?
Published Thu, Nov 27 2014 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement