కళ్లు..కాళ్లు లేకపోయినా పింఛన్ ఇవ్వడం లేదన్నా..
విజయనగరం : చూడటానికి కళ్లు లేవు... నడవటానికి కాళ్లు లేవు... అయినా పింఛన్ ఇవ్వడంలేదు. పలు సార్లు దరఖాస్తులు చేసుకున్నా అధికారులు, పాలకులు కరుణించలేదు. 2010 సంవత్సరంలో పొలం పనుల్లో భాగంగా చెట్టుపై నుంచి పడిపోవడంతో కంటిచూపు పోయింది. కాళ్లు రెండూ చచ్చుపడిపోయాయి. నా అన్నవారు లేరు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆధార్ కార్డు ఉన్నప్పటికీ పింఛను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సమస్యను జగనన్న దృష్టికి తీసుకెళ్లాను. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. – చెరుకుపల్లి రమేష్, మక్కువ