సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ‘ఆధార్’ గుదిబండగా మారింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు ఉండి తీరాలన్న నిబంధన విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తోంది. రెన్యువల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 27 నుంచి ఈ-పాస్ వెబ్సైట్లో అవకాశమివ్వగా, ఇప్పటి వరకు 10 వేల దరఖాస్తులే వచ్చాయి. ఆధార్ నిబంధన లేనప్పుడు 15 రోజుల వ్యవధిలో లక్షకు తగ్గకుండా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు పదో వంతు దరఖాస్తులైనా రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని సంక్షేమ శాఖ అధికారులే అంటున్నారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థి ఆధార్ నంబర్ను రెండుసార్లు నమోదు చేయాలి.
ఆ తర్వాత విద్యార్థి మొబైల్ నంబర్ను రెండుసార్లు నమోదు చేస్తే, మొబైల్కు వచ్చే పాస్వర్డ్ను ఎంటర్ చేస్తేనే దరఖాస్తు కనపడుతోంది. అంటే ‘ఆధార్’ లేకపోతే కనీసం దరఖాస్తు కూడా కనపడదు. అయితే, ఫీజుల పథకానికి దరఖాస్తు చేసుకునే వారిలో సగం మందికి పైగా విద్యార్థులకు ఆధార్ లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ను తప్పనిసరి చేయడం విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తోంది. గతంలో పదో తరగతి వివరాలు నమోదు చేయగానే దరఖాస్తు కనపడేది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. కాగా, ‘ఆధార్’ నిబంధనపై ప్రభుత్వం కానీ, యాజమాన్యాలు కానీ విద్యార్థులను చైతన్యపరచలేకపోవడం, కళాశాలల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం కారణంగా ఈ ఏడాది చాలామంది ఫీజుల పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని విద్యార్థి, కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆధార్తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఫీజుల పథకానికి ‘ఆధార్’ దెబ్బ
Published Fri, Aug 16 2013 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
సీఎం సభకు సర్వం సిద్ధం
రాజకీయ లబ్ధి కోసం మోదీ యూ టర్న్
సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు : డీఎస్పీ
తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం
పొలంలో ధాన్యం రాశుల దగ్ధం
మిత్ర పురుగులతో తెల్లదోమ నివారణ
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement