జాతీయ మీడియా ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్‌ | Sakshi
Sakshi News home page

జాతీయ మీడియా ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్‌

Published Thu, Aug 22 2019 9:08 PM

Devulapally Amar Appointed As National Media Advisor Of Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: సీనియర్‌ జర్నలిస్టు, ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఐజేయూ) జనరల్‌ సెక్రటరీ దేవులపల్లి అమర్‌ జాతీయ మీడియా-అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్‌.పి. సిసోడియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి అభీష్టం ఉన్నంత ఉన్నంతవరకూ అమర్‌ ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి విధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement