శంకుస్థాపనకు వెళ్లాలా, వద్దా? | Sakshi
Sakshi News home page

శంకుస్థాపనకు వెళ్లాలా, వద్దా?

Published Tue, Oct 20 2015 9:09 AM

CPM, CPI dilemma on attend on AP Capital foundation stonem programme

సీపీఐ, సీపీఎం చెరోదారి..

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజర య్యే విషయంలో లెఫ్ట్ పార్టీలు చెరోదారి పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి సీపీఐ, సీపీఎం వ్యతిరేకం కానప్పటికీ భూ సమీకరణ చేసిన తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈనెల 22న జరిగే శంకుస్థాపనకు హాజరు కావాలని భావిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూనే తమ భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని ప్రకటించారు. మరోపక్క. సీపీఎం మాత్రం ఇంతవరకు తన మనోగతాన్ని బయటపెట్టలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement