ఏపీలో మరో 9 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో 9 కరోనా కేసులు

Published Thu, Apr 16 2020 10:43 AM

CoronaVirus Positive Cases Rises To 534 In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం  కరోనా కేసులు సంఖ్య 534కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో.. కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 20 మంది డిశ్చార్జ్‌ కాగా, 14 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 500 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరులో 122, కర్నూలులో 113 కరోనా పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు.

జిల్లాల వారిగా కరోనా కేసులు..


 

Advertisement

తప్పక చదవండి

Advertisement