చిత్తూరు(సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయలుదేరి 9-40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుం టారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో 9-55 గంటలకు తిరుపతి తారకరామ స్టేడియంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చేరుకుంటారు. అక్కడ ప్రియ దర్శిని ఆడిటోరియంలో పది గంటలకు ఏర్పాటు చేసిన పెంటావలెంట్ వ్యాక్సిన్ను ప్రారంభిస్తారు.
అనంతరం హెలీప్యాడ్కు చేరుకుని 10-45 గంటలకు హెలికాప్టర్లో యాదమరి మండలంలోని అమరరాజా ఇండస్ట్రీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 1-45 గంటల వరకు అమరరాజా గ్రోత్ కారిడార్, పీఈఎస్ విద్యా సంస్థల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అరగంట విశ్రాంతి అనంతరం 2-15 గం టలకు హెలికాప్టర్లో బయలుదేరి ఏరియల్ వ్యూ ద్వారా నీవా కాలువను పరిశీలిస్తూ.. మధ్యాహ్నం 3 గంటలకు కేవీపల్లె మండలం అడవిపల్లె రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. అడవిపల్లె రిజర్వాయర్ పనులను పునఃప్రారంభిస్తారు.
మళ్లీ హెలికాప్టర్లో బయలుదేరి ఏరియల్ వ్యూ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కాలువ, తంబళ్లపల్లె కాలువ, పుంగనూరు కాలువను పరిశీలిస్తూ సాయంత్రం 4-15 గంటలకు మదనపల్లె మిట్స్ కళాశాల హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ పుంగనూరు బ్రాంచ్ కాలువ పనులను పరిశీలించి అనంతరం హంద్రీ-నీవా కాలువ బాధిత రైతులతో ముఖాముఖి, హం ద్రీ-నీవా ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ బస చేస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.
నేడు జిల్లాకు సీఎం రాక
Published Thu, May 7 2015 5:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
ఓపీవోలకు నియామక ఉత్తర్వులు ఇవ్వండి
వైఎస్సార్ సీపీలోకి పలువురు చేరిక
ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది
జగనన్న సారథ్యంలోనే రాష్ట్రం సుభిక్షం
ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకే టీడీపీ పన్నాగం
అందరినీ మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది
మేలు చేసిన వారికే మళ్లీ పట్టం కట్టండి
వైఎస్సార్ సీపీలోకి 20 కుటుంబాలు చేరిక
రెండోరోజు పోస్టల్ ఓటింగ్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement