అమలాపురం టౌన్ :పుష్కరాలకు మరో తొమ్మిది రోజులు మాత్రమే గడువుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా సమీక్షలు నిర్వహిస్తూ పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తొలి నుంచీ జూన్ 25కు పుష్కర పనులు పూర్తి కావాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ తేదీ వచ్చేసినా ఇంకా కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో గడువును జూన్ నెలాఖరుకు పొడిగించారు. అదీ సాధ్యం కాలేదు. పనుల జాప్యానికి గోదావరి వరద కొంత అవరోధమైంది. అయితే అంతకు ముందు నుంచే పనులు నత్తనడకగా సాగాయి. వరద ఆ జాప్యాన్ని మరింత పెంచింది. కోనసీమలోని బెండమూర్లంక, మురమళ్ల, గోడి, రావులపాలెం వంటి ఘాట్ల పనులు ఇంకా కొలిక్కి రాలేదు.
కోనసీమ ఘాట్ల పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుసుకున్న డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో శుక్రవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాలవారీగా పుష్కర పనులపై సమీక్షించినప్పుడు అధికారులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదన్న విషయం వెలుగు చూసింది. అధికారులు ఆయా నియోజకవర్గాల్లో పుష్కర పనుల తాజా పరిస్థితులపై ఎమ్మెల్యేలకు నివేదికలు ఇవ్వని వైనం కూడా చర్చకు రావటం గమనార్హం. తమ నియోజకవర్గంలో ఫలానా ఘాట్ పని ఎంతవరకూ వచ్చిందని ఒకరు, ఆ పనికి నిధులెన్ని పెట్టారని మరొకరు ప్రశ్నించారు. దీంతో పుష్కర పనులపై ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం లేదన్న విషయాన్ని తేటతెల్లమైంది. దీనిపై అధికారులను రాజప్ప గట్టిగానే హెచ్చరించారు. పుష్కర పనుల వివరాలను ఆయా ఎమ్మెల్యేలకు కచ్చితంగా చెప్పాలని, వారిని స్వయంగా కలసి పనుల ప్రగతిని వివరించాలని ఆదేశించారు. పనులను ఎమ్మెల్యేలు పరిశీలించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
జూన్ మొదటి వారంలో రాజప్ప కోనసీమలోని పలు ఫుష్కర ఘాట్ల పనులను స్వయంగా తనిఖీ చేశారు. పనుల జాప్యానికి కాంట్రాక్టర్లే కారణమని గ్రహించారు. ఒక్కో కాంట్రాక్టర్ 5 నుంచి 10 వరకూ పుష్కర పనులను తీసుకోవటంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయని గుర్తించి అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో పనుల జాప్యానికి ఇది ఓ కారణమైతే, ఇప్పుడు చివరి దశలో ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయ లోపం మరో కారణంగా కనిపిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం నుంచి విధిగా తమ ప్రాంతాల్లోని ఘాట్ల పనులను స్వయంగా పరిశీలించి, వేగిరం చేయాలని సూచించారు. ఏది ఏమైనా పుష్కర పనులపై అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ప్రత్యేక దృష్టి పెడితేనే స్వల్ప వ్యవధిలో అవి పూర్తయ్యే అవకాశముంటుంది. ఆదివారం జరిగే జెడ్పీ సమావేశం కూడా పూర్తిగా పుష్కర అజెండాతోనే సాగనుంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు ఈ కొద్ది రోజులూ పూర్తిగా పుష్కర పనులపైనే దృష్టి కేంద్రీకరించనున్నారని తెలిసింది.
చెరో మాట.. చెరో బాట
Published Sun, Jul 5 2015 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement