సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) పరీక్ష తేదీని రెండు రోజులు ముందుకు జరిపి మే 8న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ పరీక్ష తేదీని మే 10గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు డీఎస్సీ (టీచర్ రిక్రూట్మెంటు టెస్టు), కేసెట్ పరీక్షలు ఉండటంతో షెడ్యూల్ను రెండు రోజులు ముందుకు జరుపుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సచివాలయంలోని ఆయన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విన్నపాలతో పాటు పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం 250 కేంద్రాలు, మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం 125 కేంద్రాలుంటాయని, 17 రీజనల్ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 1.70 లక్షల ఇంజనీరింగ్ సీట్లు, 3,100 మెడికల్ సీట్లు ఉన్నాయని చెప్పారు. ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూకి అప్పగించామని, చైర్మన్గా ప్రభాకరరావు, కన్వీనర్గా సాయిబాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇతర సెట్ల తేదీల్లో మార్పు ఉండదన్నారు. పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని, ఆన్లైన్లోనూ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎంసెట్ మార్కులతో పాటు ఇంటర్మీడియెట్లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను నిర్ణయిస్తారన్నారు. ఈ ఏడాది వరకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. ఎంసెట్ను ఉంచాలా? రద్దుచేయాలా? తమిళనాడు తరహాలో ఇంజనీరింగ్ కాలేజీలు నేరుగా ప్రవేశాలు నిర్వహించాలా? అన్న అంశాలపై కమిటీ వేశామని తెలిపారు. కాగా,ఎంసెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. కన్వీనర్గా ఉన్న జేఎన్టీయూ (కాకినాడ) ప్రొఫెసర్ సాయిబాబు ఈ నోటిఫికేషన్ విడుదలచేయనున్నారు. ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈసారి పాత సెలబస్తోనే ఎంసెట్ నిర్వహించనున్నారు.
ఇదీ షెడ్యూల్..
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం మార్చి 6
ఫైన్ లేకుండా చివరి గడువు ఏప్రిల్ 11
500 ఫైన్తో గడువు ఏప్రిల్ 16
1,000 ఫైన్తో గడువు ఏప్రిల్ 22
5వేల ఫైన్తో గడువు మే 2
10వేల ఫైన్తో గడువు మే 6
హాల్టిక్కెట్ల డౌన్లోడ్ మే2-మే 6
ఎంసెట్ పరీక్ష మే 8
ఇతర సెట్లు, వాటి తేదీలు
సెట్పేరు తేదీ వర్సిటీ
ఈసెట్ మే14 ఏయూ
పీఈసెట్ మే14 ఏఎన్యూ
ఐసెట్ మే16 జేఎన్టీయూఏ
పీజీసెట్ మే25 ఎస్కేయూ
ఎడ్సెట్ మే28 ఎస్వీయూ
లాసెట్/పీజీలాసెట్ మే30 జేఎన్టీయూకే
ఏపీలో మే 8న ఎంసెట్
Published Tue, Mar 3 2015 1:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement