కరోనా: కర్నూలులో ఒకే రోజు 47మంది డిశ్చార్జ్
సాక్షి, కర్నూలు : జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి బారినుంచి కోలుకుని బయటపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 47 మంది కరోనా విజేతలు ఆసుపత్రులనుంచి డిశ్చార్చ్ అయ్యారు. దీంతో జిల్లాలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. ఈ రోజు డిశ్చార్చ్ అయిన 47 మందిలో కర్నూలు చైతన్య కాలేజ్ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 17 మంది, నంద్యాల శాంతిరామ్ జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుండి 12 మంది, కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుండి 9 మంది, కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రి నుండి 9 మంది ఉన్నారు. కాగా, కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 390 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చ్ అయ్యారు.
చదవండి : కర్నూలు: గురువారం నమోదైన కేసులు 0