-
ప్రేమకథ ఆరంభం
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ల కొత్త ప్రేమకథ మొదలైంది. ‘బవాల్’ సినిమా తర్వాత వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే ప్రేమకథా చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. సన్నీ పాత్రలో వరుణ్, తులసీ కుమారి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని ఊహించవచ్చు.శశాంక్ కేతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శనివారం మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వరుణ్ ధావన్తో పాటు ఈ సినిమా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల కానుంది. -
వేరు కుంపట్లతో దాసరిగారి పేరు చెడగొట్టొద్దు: దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నరసింహారావుగారు (దర్శకుడు) మాట్లాడి, దాసరిగారి పేరిట రామ సత్యనారాయణ ఓ ఈవెంట్ చేశారు. రేపు మేం చేయబోతున్నాం అన్నారు. నేనేం అంటున్నానంటే... వచ్చే ఏడాది నుంచి సినిమా ఇండస్ట్రీ తరఫున దాసరిగారి జయంతిని అందరూ ఒక్కటై, ఒకే వేడుకలా జరుపుకునేలా ΄్లాన్ చేద్దాం. బయటివాళ్లు కావాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటారు.ఇండస్ట్రీలో వేరు వేరు కుంపట్లు పెట్టి, గురువు (దాసరి నారాయణరావు) గారి పేరుని మనం చెడగొట్టొద్దు. గురువుగారి పేరును నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4)ని ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటోంది. తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగాల్సింది.కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈవెంట్ తేదీని ఈ నెల 19కి మార్చామని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ వేడుక కొత్త తేదీ పోస్టర్ను తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘దేశవ్యాప్తంగా సినీ కార్మికుల సంక్షేమంలో టాలీవుడ్ నంబర్ వన్గా ఉందంటే కారణం దాసరిగారే’’ అన్నారు సి. కల్యాణ్.‘‘డైరెక్టర్స్ డే ఈవెంట్ సక్సెస్ కావడానికి శ్రమిస్తున్న యువ దర్శకులకు ధన్యవాదాలు’’ అన్నారు వీరశంకర్. ‘‘దాసరిగారి పేరిట రామసత్యనారాయణ ఈవెంట్ చేశారు. మే 5న మేం చేస్తున్నాం. దర్శకుల సంఘం చేయనున్న ఈవెంట్ కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు రేలంగి నరసింహారావు. నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకులు ఎన్. శంకర్, సముద్ర, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వశిష్ఠ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
అంతకు మించి...
‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో రామ్ని ఫుల్ మాస్గా చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో మాస్, కామెడీ, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో అంతకు మించి ఉంటాయి. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. తొలి భాగంలోకన్నా ఇంకా మాస్గా కనిపించ డంతో పాటు స్టయిలిష్గానూ కనిపించనున్నారు.‘‘ఈ చిత్రంలో రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ పాన్ ఇండియా చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ఆరంభమైంది. ఈ లెన్తీ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఎక్కువ శాతం సినిమా పూర్తవుతుంది. సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి స్వరాలు అందించిన మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
నాన్స్టాప్గా...
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా జెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది. మలయాళంలో ‘ది పెట్ డిటెక్టివ్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, తెలుగులో ‘పరదా’, తమిళంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు అనుపమ. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అలాగే ‘హను–మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), కౌశిక్ తెరకెక్కిస్తున్న ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లోనూ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అనుపమ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న మరో కొత్త సినిమా ప్రకటన శనివారం వెల్లడైంది. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమాతో ఏఆర్ జీవా దర్శకుడిగా పరిచయం అవుతారు. ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని కోలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘ఈగల్’, ‘టిల్లు స్వే్కర్’, ‘సైరన్’ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఇలా ఇప్పటికే అనుపమ మూడుసార్లు థియేటర్స్లో కనిపించారు. ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
పిచ్చిగా నచ్చేశావే...
‘‘పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా.. కళ్లలో చల్లేశావే రంగులన్నీ భలేగా..’ అంటూ సాగుతుంది ‘గం..గం..గణేశా..’ సినిమాలోని ‘పిచ్చిగా నచ్చేశావే’ పాట. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. శనివారం ఈ చిత్రంలోని ‘పిచ్చిగా నచ్చేశావే..’ పాట లిరికల్ వీడియోను హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల సమక్షంలో రిలీజ్ చేసింది యూనిట్. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement