-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై కూటమి దుష్ప్రచారం
పొందూరు: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై కూటమి అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తోందని, ఆమదాలవలస నియోజకవర్గం అభ్యర్థి తమ్మినేని సీతారాం ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం అనంతరం ధర్మపురం గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్లు చట్టాలపై అవగాహన లేమితో ఉన్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ గెజిట్ తీసుకువచ్చిందన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా గొప్పదని స్వయంగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో చెప్పాడని, బిల్లుకు టీడీపీ సైతం సభలో మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు బృందం ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసి అబద్దాలు చెబుతున్నారని తెలి పారు. ఎవరి వద్దనైనా ప్రభుత్వం భూమిని లా క్కుందా అని ప్రశ్నించారు. 2014లో నందివాడలో చేతికి దెబ్బతగలిందని డ్రామాలాడావు, ఇప్పుడేమో కొత్త డ్రామాలకు తెరలేపుతావా అని కూన రవికుమార్ను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి డ్రామాలకు ఓట్లు పడవని, ప్రజలు నమ్మరని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మొదలవలస పాపారావు, మొదలవలస వెంకటరమణ, పప్పల అన్నాజీ, చల్ల ముఖలింగం, యతిరాజుల గోవింద, గాడు నాగరాజు, అనకాపల్లి రామకృష్ణ, వాసుదేవరావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయంలో నకిలీ రశీదులతో వసూళ్లు
అరసవల్లి: జిల్లా కేంద్రంలోని ఓ ఆలయ అటెండర్ నకిలీ రశీదులతో చేస్తున్న మోసం బయటపడింది. శ్రీకాకుళం గుడివీధిలో ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చెందిన 14.70 ఎకరాల భూముల నుంచి సుమారు రూ.3లక్షల ఉంచి రూ.5 లక్షల మేరకు రావాల్సిన శిస్తులకు ఆలయ అటెండర్ సతీష్ టోపీ పెట్టాడు. ఈ ఆలయ భూములను సేద్యం చేస్తున్న, లీజుల కింద అనుభవిస్తున్న వారి వద్ద నుంచి నకిలీ రశీదులతో శిస్తు వసూలు చేశాడు. అప్పట్లో ఆల యానికి ఈఓగా పనిచేసిన ఓ అధికారి అండదండలతోనే అటెండర్ సతీష్ ఇలా బరితెగించినట్లుగా దేవదాయ శాఖాఽధికారులు గుర్తించారు. 14.70 ఎకరాల భూముల నుంచి వసూళ్లు మాయం ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి నగర నలువైపులా మెట్టు, పల్లం భూములు సుమారుగా 14.70 ఎకరాలున్నాయి. అయితే ఇవన్నీ దాదాపుగా లీజుల్లోనూ, సేద్యపు హక్కుల కిందనే నిబంధనల ప్రకారమే ఉన్నాయి. వీరంతా ఏటా లీజుల ప్రాప్తికి ఆలయానికి ఎకరా చొప్పున శిస్తులను చెల్లిస్తూ వస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ఫలసాయాన్ని నేరుగా సంబంధిత ఆల య ఈఓ కలెక్ట్ చేసి రశీదును అందించాల్సి ఉంటుంది. అయితే ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో గత కొన్నేళ్లుగా అనధికారికంగా ఈ అటెండర్ సతీష్ నేరుగా రైతుల వద్దకు, లీజుదారుల వద్దకు వెళ్లి కలెక్ట్ చేసుకుని నకిలీ రశీదులను ఇచ్చేసి రూ.లక్షల్లో సొమ్మును జేబులో వేసేసుకున్నాడు. ఆలయ ఈఓగా కొద్ది నెలల కిందటే బాధ్యతలను చేపట్టిన సుకన్య ఆలయ డీసీబీ రికార్డును (డిమాండ్ కలెక్షన్ బ్యాలన్స్) చెక్ చేస్తే గత కొన్నేళ్లుగా లీజుదారుల నుంచి ఎలాంటి శిస్తులు చెల్లింపులు జరగలేదని, డీసీబీలో నమోదు కాలేదని గుర్తించి వారందరికీ నోటీసులు జారీ చేశారు. దీంతో బాధితులు ఇచ్చిన వివరణతో అటెండర్ సతీ ష్ నిర్వాకం బయటపడింది. ఈ వ్యవహారంపై శా ఖాపరంగా విచారణ చేపట్టగా రైతులంతా న్యాయంగా చెల్లించిన శిస్తులన్నీ రికార్డులోకి రాకుండా సతీష్ జేబులోకి వెళ్లినట్లుగా గుర్తించారు. అనధికారిక వసూళ్లు నిజమే.. కోటేశ్వరాలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామికి 14.70 ఎకరాల భూములుంటే.. 2023 నుంచి ఎలాంటి శిస్తు వసూళ్లు డీసీబీలో ఎంటర్ కాలేదని గుర్తించాను. తీరా నోటీసులిస్తే నకిలీ రశీదులను చూపించారు. విచారణ చేపడితే అటెండర్ సతీష్ నిర్వాకమని తెలిసింది. వెంటనే అతనికి షోకాజ్ మెమో జారీ చేశాం. ఆ సమయం కూడా ముగియడంతో తదుపరి కఠిన చర్యలు చేపట్టనున్నాం. ఇప్పటికే ఈవిషయమై జిల్లా దేవదాయ శాఖాధికారి ప్రసాద్పట్నాయక్ కూడా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. – ఎం.సుకన్య, ఆలయ ఈఓ -
గంజాయి నిల్వల పట్టివేత
కంచిలి: మండలంలోని అంపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి గంజాయి రవాణా చేస్తుండటాన్ని గుర్తించారు. ఒక వ్యక్తి ఇచ్ఛాపురం వైపు నుంచి స్కూటీలో మూడు బ్యాగులను తీసుకొస్తుండగా వాహనం ఆపి ప్రశ్నించారు. ఈ బ్యాగుల్లో జీడిపప్పు రవాణా చేస్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పడంతో, సంబంధిత బిల్స్ చూపించా లని అధికారులు కోరారు. దీంతో ఆ వ్యక్తి వాహనం ఆపి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ స్కూటీలో ముందు భాగంలో ఒక బ్యాగు, వెనుక భాగంలో రెండు బ్యాగులు ఉన్నాయి. వాటిలో 40 ప్యాకెట్ల గంజాయిని తనిఖీ అధికారులు గుర్తించారు. ఒక్కో బ్యాగులో 2కిలోల 60గ్రాముల చొప్పున గంజాయి ఉంది. మొత్తంగా 82కిలోల570 గ్రాములు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.4,12, 850లుగా గుర్తించారు. ఈ సరుకును పట్టుకున్న వారిలో డిప్యూటీ తహసీల్దార్ డి.సంతోష్, ఆర్అండ్బీ ఏఈ మోహనరావు, పోలీస్ కానిస్టేబుల్ అశోక్, విఆర్వోలు ఉమాపతి, కృష్ణారావు ఉన్నారు. ఈ సరుకును, స్కూటీని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించడంతో, దీనిపై స్థానిక ఎస్ఐ వి.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
● ఇచ్ఛాపురంలో సీఎం వైఎస్ జగన్ సభకు వెల్లువలా తరలివచ్చిన జనం ● జగన్నినాదంతో మార్మోగిన గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ● మధ్యాహ్నం ఒంటిగంటకే ఇసుకేస్తే రాలనంత జనం ● అధినేతకు నాయకుల ఘనస్వాగతం ● కార్యకర్తలకు ఊపునిచ్చిన జగన్ ప్రసంగం ● ఆద్యంతం ఈలలు వేస్తూ మద్దతు తెలిపిన అభిమాన తరంగం ● ఆనందోత్సాహాల నడుమ ఆడిపాడిన అక్కాచెల్లెమ్మలు -
మమ్మల్ని ఆదుకునే నాయకుడు
జగనన్న పాదయాత్రలో మా కష్టాలను చూశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఏడాదికి రూ. 24 వేలు చొప్పున రూ. 1.20లక్షలు నా ఖాతాలో జమచేశారు. పింఛన్ నెలకు రూ. 3 వేలు అందుతోంది. నేత కార్మికుల అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకునే నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. – బస్వా మోహనరావు, చేనేత కార్మికుడు, పొందూరు చేయూతనిచ్చారు.. రాత్రి, పగలు మగ్గం మీద పనిచేస్తున్నప్పటికీ కడుపు నింపుకోలేకపోతున్న మా జీవితాలకు సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద జమ చేసిన రూ. 24 వేలును సద్వినియోగం చేసుకుంటున్నాం. నేతన్నలకు చేదోడు వాదోడుగా నిలిచారు. చేనేత కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిచింది. – మందుల హేమసుందరరావు, చేనేత కార్మికుడు, పొందూరు. ●
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement