-
అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీంకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 21న రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా మేయర్లు పాల్గొననున్నారు. భారత్ నుంచి ఐదుగురు మేయర్లకు ఆహ్వానం అందగా..అందులో అనంతపురం మేయర్ ఒకరు. మిగిలిన వారిలో జైపూర్, క్యాలికట్, త్రిసూర్, నాగర్ కోయిల్ మేయర్లు ఉన్నారు. అనంతపురం మేయర్కే ఎందుకంటే.. అనంతపురానికి, రష్యాకు చారిత్రక సంబంధం ఉంది. 550 ఏళ్ల కిందట రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించాడు. ఆ∙అంశాలు ఇటీవల కజాన్లో జరిగిన అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశంలో చర్చకు వచి్చ.. అనంతపురం ప్రాధాన్యతను గుర్తు చేశాయి. కాగా, అనంతపురం నగరాన్ని సందర్శించిన రష్యన్ యాత్రికుని రచనలను పరిగణనలోకి తీసుకుని మేయర్ల సదస్సుకు అనంతపురం నగరాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది అని మేయర్ అన్నారు. -
టీబీ డ్యాంకు కొనసాగుతున్న వరద
బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం ఉదయానికి జలాశయంలో 6.110 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,619 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. అవుట్ఫ్లో 577 క్యూసెక్కులుగా ఉంది. ప్రసుత్తం జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1583.03 అడుగులకు చేరుకుంది. డ్యాం సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.110 టీఎంసీల నీరు ఉంది. డ్యాం ఎగువ భాగాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో మరింత పేరిగే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 1,580.94 అడుగుల వద్ద 4.940 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని బోర్డు అధికారులు తెలిపారు. -
మహోన్నత త్యాగానికి ప్రతీక
ఇబ్రహీం గొప్ప ప్రవక్తల్లో ఒకరు. ఆయనకు ‘ఖలీలుల్లాహ్’ అనే బిరుదు ఉంది. అంటే ‘అల్లాహ్ మిత్రుడు’ అని అర్థం. దైవ ప్రసన్నం కోసం చేసే కార్యాన్ని మించింది లేదని తన జీవితం ద్వారా ఆయన నిరూపించారు. కలలో ఏదైనా కన్పిస్తే అది ఆ దేవుని ఆ/్ఞ అని ఆయన భావించి వెంటనే ఆచరించారు. ఇబ్రహీంతో పాటు ఆయన కుమారుడు ఇస్మాయిల్ల మహోన్నత త్యాగనిరతిని స్మరించుకోవడం కోసం ఈ బక్రీదు పండుగను జరుపుకుంటాం. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్యాత్ర చేసి ముక్తిని పొందాలి. –సయ్యద్ ఉబేదుల్లా హుసేని, హజరత్ సయ్యద్ జహీరుద్దీన్ బాబా దర్గా పీఠాధిపతి, కుటాగుళ్ల, కదిరి ప్రవక్తలను ఆదర్శంగా తీసుకోవాలి ప్రవక్తల త్యాగానికి ప్రతీక బక్రీద్. ఆనాడు వారు ఆచరిస్తే నేడు పండుగలా ముస్లింలు జరుపుకొంటున్నారు. ప్రవక్తల జీవితాలు, వారు అనుసరించిన విధానాలను తీసుకొని అనుసరించాలి. చెడుమార్గాలకు దూరంగా మంచి, శాంతి మార్గాల్లో నడవాలి. సేవా గుణం కలిగి ఉండాలి. పండుగ తరువాత కూడా ఇదే స్ఫూర్తితో మెలగాలి. – జాకీర్ ముక్తాసాబ్, ముత్తవల్లి, పుట్టపర్తి -
వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి
గోరంట్ల: మండల కేంద్రం గోరంట్లలో వైఎస్సార్సీపీ నాయకుడు, వానవోలు ఉపసర్పంచ్ బుల్లెట్ బాబు ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున రాళ్లతో దాడి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బుల్లెట్ బాబు వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున క్రియాశీలకంగా పనిచేశారు. శనివారం రాత్రి బాబు కుటుంబ సభ్యులు భోజనం చేసి ఇంట్లో నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటల సమయంలో ఇంటిపైకి రాళ్లు పడ్డాయి. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు బయటకు రాగా.. కాంపౌండ్లోకి విచ్చలవిడిగా కంకర రాళ్లు కనిపించాయి. తమను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా చేశారని బాధితుడు చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పరామర్శ దాడి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ ఆదివారం సాయంత్రం గోరంట్ల చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు బుల్లెట్ బాబును పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడు ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్గా చేసుకుని టీడీపీ–జనసేన నాయకులు దాడులకు తెగబడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. దాడులు ఆపి.. పాలనపై దృష్టి సారించాలని అధికార పార్టీ నేతలకు హితవు పలికారు. దాడులు చేస్తూ పోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సేవకు వినియోగించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు కళ్లగేర శంకరరెడ్డి, గోరంట్ల ఉప సర్పంచ్ రాజారెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహమూర్తి, ఆనంద్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
మితిమీరితే ముప్పే
ప్రశాంతి నిలయం: జలుబు, దగ్గు, జ్వరం తదితర ఏ చిన్న జబ్బు చేసినా వెంటనే తగ్గిపోవాలని చాలామంది యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. డాక్టరును సంప్రదించకుండా నేరుగా మందుల షాపుకెళ్లి యాంటీబయాటిక్స్తో కూడిన మందులు తెచ్చుకుంటున్నారు. అవసరం లేకున్నా యాంటీబయాటిక్స్ వాడితో ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 900 పైచిలుకు హోల్సేల్, రిటైల్ మందుల దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా కోటి రూపాయలకు పైగా విలువ చేసే యాంటీబయాటిక్స్ మందుల విక్రయం జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అజిత్రోమైసిన్, సెఫాక్సిమ్, నార్ఫ్లాక్సిన్, సెఫ్ట్రియాక్సోన్, ఆఫ్లాక్సోసిన్, టాజోబ్యాక్లమ్, సిఫ్రాన్, సిఫ్రోఫ్లాక్సిన్ వంటి యాంటీబయాటిక్స్ ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు. డాక్టర్ సూచన మేరకే యాంటీబయాటిక్స్ విక్రయించాలని నిబంధన ఉన్నా మందుల దుకాణదారులు అవేమీ పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారులు దృష్టిసారించకపోవడంతో ప్రజలు ఎడాపెడా వాడేస్తూ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అతిగా వాడితే కలిగే దుష్ప్రభావాలివీ.. యాంటీబయాటిక్ మందులను రోగులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల కిడ్నీ, కాలేయం, చర్మ సంబంధిత వ్యాధులబారిన పడుతున్నారు. యాంటీబయాటిక్స్ ఎడాపెడా వాడడం వల్ల మన శరీరం సహజసిద్ధంగా ఉండే వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతుంది. రోగులకు వచ్చిన ఆరోగ్య సమస్య ఆధారంగా, తీవ్రతను బట్టి ఎంత మోతాదులో, ఏ రకమైన యాంటీబయాటిక్స్ ఎంత కాలం వాడాలి అన్నది వైద్యుల సూచన మేరకే పాటించాలి. సొంత వైద్యంతో తీవ్రమైన అనర్థాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మోతాదు తక్కువ తీసుకుంటే రోగ కారక బ్యాక్టీరియా క్రమక్రమంగా మందులకు లొంగకుండా తమ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎక్కవ మోతాదులో వాడటం వల్ల కాలేయం, గుండె, కిడ్నీ, చర్మం వంటి శరీర భాగాలపై అధిక ప్రభావం చూపి తీవ్ర ఆనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. భారీగా పెరిగిన యాంటీ బయాటిక్స్ వాడకం అవసరం లేకున్నా వాడితే దుష్ఫలితాలు తప్పవు డాక్టర్ సూచనతోనే వాడాలి రోగం వచ్చినప్పుడు వైద్యుల సూచనల మేరకే యాంటీబయాటిక్స్ మందులు వాడాలి. ఇష్టమొచ్చినట్టు వాడడం వల్ల కాలేయం, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సహజంగా లభించే రోగ నిరోధకశక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. మందుల దుకాణాల్లో వైద్యుల సూచనలు లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మంజువాణి, డీఎంఅండ్హెచ్ఓ -
అలరించిన ‘సాయి ప్రేమ వాహిని’
ప్రశాంతి నిలయం: సాయి సేవలో తరించిన అనుభవాలను కళ్లకు కడుతూ సాయి యూత్ ‘సాయి ప్రేమ వాహిని’ పేరుతో నిర్వహించిన నాటిక భక్తులను ఆలరించింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన సత్యసాయి భక్తులు ఆదివారం సత్యసాయి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత నాటిక ప్రదర్శించారు. తమ ప్రాంతంలో నిర్వహించిన సత్యసాయి బోధనలు, సేవా కార్యక్రమాలు, అనుభూతుల సమాహారాన్ని నాటికలో కళ్లకు కట్టినట్టు చూపారు. సత్యసాయి తన స్వహస్తాలతో రాసిన రామకథ రసవాహినిని అనుసరిస్తూ మధ్యప్రదేశ్ బాలవికాస్ చిన్నారులు సాయంత్రం ‘శ్రీ రామ ఆగమన్’ పేరుతో నిర్వహించిన నృత్య రూపకం భక్తులను మైమరపించింది. -
ప్రమాదంలో యువకుడి మృతి
పెనుకొండ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... తమిళనాడుకు చెందిన ధనుంజయ (34) కియా అనుబంధ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై వెళుతూ తిమ్మాపురం సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే పాత బీఎస్ఎన్ఎల్ గదిని ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ధనుంజయను అటుగా వెళుతున్న గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆదివారం తెల్లవారుజామున ఆయన మృతి చెందాడు. మృతుడి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్హెచ్ఎ రమేష్ తెలిపారు. లారీ డ్రైవర్ దుర్మరణంచెన్నేకొత్తపల్లి: ఆగి ఉన్న లారీని వెనుక ఉంచి ఢీకొన్న ఘటనలో మరో లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ధాబా వద్ద శనివారం అర్ధరాత్రి ఓ లారీని ఆపి డ్రైవర్, క్లీనర్ టీ తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో బెంగళూరు నుంచి అనంతపురం వైపుగా వేగంగా వెళుతున్న మరో లారీ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఘటనలో ఢీకొన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. లారీని నడుపుతున్న తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన డ్రైవర్ శంకర్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లారీలో ఇరుక్కున్న శంకర్ మృతదేహాన్ని జేసీబీ సాయంతో వెలికి తీశారు. మృతుని తమ్ముడు వడివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘ప్రాఽథమిక బోధన మాతృభాషలోనే కొనసాగాలి’
కొత్తచెరువు: ప్రాథమిక పాఠశాలలో బోధన మాతృభాషలోనే కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్ కుమార్ మాట్లాడారు. విద్యావ్యవస్దకు నష్టం చేకూర్చేలా ఉన్న జీఓ 117ను వెంటనే రద్దు చేసి ప్రాథమిక విద్యా వ్యవస్దను బలోపేతం చేయాలన్నారు. 6 నుంచి 10 తరగతులకు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్ర, గౌరవ అధ్యక్షుడు పి.వి.మాధవ, సభ్యులు లతారామకృష్ణా, అంజనమూర్తి, రవీంద్రారెడ్డి, వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
కొత్తచెరువు: మానసిక ఒత్తిళ్లు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు... కొత్తచెరువు గ్రామానికి చంఎదిన చంద్రప్పగారి పవన్కుమార్ (29) ఇటీవల బీటెక్ పూర్తి చేసి రెండు నెలల క్రితం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరాడు. హైదరాబాద్లోనే తన స్నేహితులతో కలసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఒత్తిళ్లను తాళలేక మనస్తాపం చెందిన పవన్కుమార్ శనివారం రాత్రి గదిలో స్నేహితులు ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడి మృతితో పవన్ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గుండెపోటుతో సర్పంచ్ మృతి పుట్టపర్తి అర్బన్: మండలంలోని అమగొండపాళ్యం సర్పంచ్ రామచంద్ర నాయుడు(53) తీవ్ర గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీరాభిమాని అయిన రామచంద్ర ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలైనప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది శనివారం ఇంటికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు భార్య వసుంధర తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, రెస్కో మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, మండల కన్వీనర్ నరసారెడ్డి, మాజీ సర్పంచ్లు ఈశ్వరయ్య, తిమ్మప్ప, గంగాద్రి, గ్రామస్తులు... రామచంద్రనాయుడు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైలు కింద పడి మహిళ మృతి రాప్తాడు: మండలంలోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామానికి చెందిన నాగరత్నమ్మ (55)గా గుర్తించినట్లు ధర్మవరం రైల్వే ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. కాగా, పాఠశాలల వద్ద పండ్లు అమ్ముకుని జీవనం సాగించే నాగరత్నమ్మ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
పొలాల దారి కబ్జా
●టీడీపీ నేత దుశ్చర్య సాక్షి, పుట్టపర్తి: రామగిరి మండలంలో పొలాల కోసం ఏర్పాటు చేసుకున్న దారిని పరిటాల కుటుంబం అండ చూసుకుని కబ్జా చేశారు. శ్రీహరిపురం – దామాజిపల్లి మార్గంలోని 40 మంది రైతుల పొలాలకు దారి లేక ఇబ్బంది పడేవారు. రైతుల కష్టాలను గుర్తించిన సర్పంచ్ రెండు నెలల కిందట జేసీబీతో చదును చేయించి పొలాలకు దారి ఏర్పాటు చేయించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ–జనసేన– బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెలకు చెందిన టీడీపీ నేత జగన్నాథ్ వారం రోజుల కిందట తన అనుచరులతో వెళ్లి శ్రీహరిపురం – దామాజిపల్లి మార్గంలోని పొలాల దారిని కబ్జా చేశాడు. ట్రాక్టర్తో దున్నించి.. ఆ భూమిలోనే విద్యుత్ స్తంభాలు పాతించాడు. ప్రస్తుతం అందులో పంట సాగుకూడా చేశాడు. సమీపంలోని రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు గానీ, ట్రాన్స్కో అధికారులు గానీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
హిందూపురం టౌన్: నూతన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు డీఈఓ మీనాక్షి సూచించారు. స్థానిక సప్తగిరి డిగ్రీ కళాశాల వేదికగా హిందూపురం డివిజన్ భగీరథ ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప్పర (సగర) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఈఓ మీనాక్షి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యకు మించిన సంపద ఏదీ లేదన్నారు. నూతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు ఆదినారాయణ, అనంతపురం శారద, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, సప్తగిరి కళాశాల మాజీ సీఈఓ ఈశ్వరరెడ్డి, మహంతీష్, రాజశేఖర్, కార్యదర్శి ఎల్ఐసీ వెంకటేశులు, ట్రెజరర్ రామాంజినేయులు, కిష్టప్ప, నాగప్ప, జాయింట్ సెక్రటరీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
మామిడిలో యాజమాన్యం చేపట్టండి
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడిలో కాయ కోతలు దాదాపు పూర్తయినట్లు రెండు జిల్లాల ఉద్యానశాఖ డీడీలు జి.చంద్రశేఖర్, జి.ఫిరోజ్ఖాన్ తెలిపారు. కోతల తర్వాత చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపైనే వచ్చే ఏడాది పంట దిగుబడులు ఆధారపడి ఉంటాయన్నారు. ఈ క్రమంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్దతులను వివరించారు. ● తోటలో మామిడి కాయలు పూర్తిగా కోసిన తర్వాత ఒకసారి నీటి తడి ఇవ్వాలి. ● ఎండుపుల్లలు, పూతకాడలు, ఆకుగూళ్లు లాంటివి ఏరివేయాలి. ● చెట్ల మధ్య భాగంలో చిన్నపాటి కొమ్మలు తొలగించి సూర్యరశ్మి బాగా ప్రసరించేలా చేయాలి. ● బాగా ముదిరిన చెట్లలో అధికంగా పెరిగిన కొమ్మలను రంపం లేదా పవర్సాతో కత్తిరించాలి. ● చెట్ల ఎత్తును బాగా తగ్గించాలి. ● తొలగించిన కొమ్మల చివర కాపర్ సంబంధిత శిలీంధ్రనాశిని లేదా బావిస్టన్ను పూయాలి. ● తొలకరి సమయంలో చెట్ల మొదళ్ల వద్ద భూమిని దున్నాలి. లేకుంటే పాదులను తవ్వి తిరగేయాలి. ● జూన్, జూలైలో ఎకారకు 10 కిలోల జీలుగ లేదా 25 కిలోల జనుము లాంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లి 45 నుంచి 50 రోజుల తర్వాత బాగా కలియదున్నితే భూసారం పెరుగుతుంది. ● ప్రతి చెట్టు పాదులో 100 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు లేదా 10 కిలోల వర్మీ కంపోస్టు వేయాలి. ● సిఫారసు చేసిన మోతాదులో ఒక్కో చెట్టుకు 1.7 కిలోల యూరియా, 1.1 కిలోల సింగిల్సూపర్పాస్ఫేట్, 1.15 కిలోల పొటాషియం సల్ఫేట్ వేయాలి. ● జూన్–జూలై అలాగే అక్టోబర్–నవంబర్లో సంవత్సరానికి రెండు సార్లు పైన తెలిపిన విధంగా రసాయన ఎరువులు వేయాలి. ● కొత్త చిగుర్లు వచ్చే సమయంలో ఒక్కో చెట్టుకు 5 గ్రాముల జింక్సల్ఫేట్, 2 గ్రాముల బోరాక్స్, 10 గ్రాముల యూరియా ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పిందె కట్టడానికి వీలుగా పూత వచ్చే ముందు మొదటి దశలో పిచికారీ చేసే మందులలో 2 గ్రాముల బోరాక్స్ (సొల్యూబార్) లీటర్ నీటికి కలుపుకుంటే ఫలితాలు బాగుంటాయి. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
కదిరి/పుట్టపర్తి టౌన్: ముస్లింల ప్రధాన పండుగలు రెండు. ఒకటి రంజాన్, మరొకటి బక్రీద్. బక్రీద్లో బకర్ అంటే మూగజీవి. ఈద్ అంటే పండుగ. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈద్–ఉల్–జుహ అని కూడా ఈ పండుగను పిలుస్తారు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సోమవారం ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని ఈద్గాలతో పాటు మసీదులలో సామూహిక ప్రార్థనలు జరుపుకునేందుకు మతపెద్దలు, ముస్లింలతో పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అల్లా ఆజ్ఞను తూచ తప్పకుండా పాటించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. కన్న కొడుకునే బలి ఇచ్చేందుకు సిద్ధం ఇస్లాం మత ప్రథమ అధ్యాయ ప్రారంభకులైన హజరత్ ఇబ్రహీం దంపతులకు కొన్నేళ్లపాటు పిల్లలు లేరు. దైవానుగ్రహంతో తనకు 80 ఏళ్ల వయసులో జన్మించిన ఏకై క పుత్రుడికి ఇస్మాయిల్ అనే పేరు పెట్టారు. ఓరోజు తన కన్నకొడుకును బలి ఇస్తున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు. నిజానికి అది కల కాదు. దైవాదేశ పాలనలో ప్రేమానురాగాలకు తావులేదని చాటిచెప్పేందుకు ఎదురైన విషమ పరీక్ష. తన కుమారుడికి ఈ విషయం చెబితే ఇందుకు కుమారుడు తనను బలి తీసుకోవచ్చు అంటూ సంతోషంగా ముందుకొచ్చాడు. ‘దైవాదేశాన్ని వెంటనే అమలు పరచండి’ అన్నాడు. కొడుకును బలి ఇచ్చేందుకు ఇబ్రహీం సిద్ధమయ్యాడు. అక్కడున్న వారంతా ఆశ్యర్యపోతారు. అప్పుడు చుట్టూ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ‘నా ప్రియ ప్రవక్తా.. ఇబ్రహీం!. నీ త్యాగాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నీకు ఎంతో ఇష్టమైన కన్నకొడుకునే బలి ఇచ్చేందుకు ముందుకొచ్చావు. నా పరీక్షలో మీరు అత్యున్నత శ్రేణిలో నెగ్గారు. నీ కొడుకు బదులు ఈ జంతువును బలి ఇవ్వండి’ అన్న దైవవాణి విన్పించింది. వెంటనే అక్కడ మూగజీవం ప్రత్యక్షమైంది. అప్పుడు దాన్ని బలి ఇస్తారు. అందుకే త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఖుర్బానీ ఇవ్వడం ఆచారం ఖుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. సాన్నిథ్యం, సామీప్యం, సమర్పణ అని కూడా అర్థం. అంటే దైవసాన్నిథ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావిస్తారు. ప్రాణ త్యాగానికికై నా వెనుకాడనని చాటిచెప్పేందుకు నిదర్శనమే ఈ ఖుర్బానీ. బక్రీదుకు బలి ఇచ్చిన నెమరు వేసే మూగజీవి మాంసాన్ని మూడు భాగాలు చేసి అందులో ఒక భాగం పేదలకు పంచి పెడతారు. ఇంకో భాగం బంధువులకు, మిగిలిన మూడో భాగం కుటుంబ సభ్యుల కోసం వాడుకుంటారు. తప్పక వెళ్లాల్సిన హజ్యాత్ర ఇస్లాం మత గ్రంథం ఖురాన్–ఎ–షరీఫ్లో ‘ఇమాన్, ఇహాన్, ఇబాదత్ మూలసిద్ధాంతాలు. భగవంతుడు ఒక్కడే అని ఇమాన్ చెబుతుంది. మానవులు పాటించాల్సిన నైతిక విలువలు ఇహాన్కు సంబంధించినవి. ఇబాదత్లో ప్రతి ముస్లిం తప్పకుండా అనుసరించాల్సిన ఐదు నియమాలు ఉన్నాయి. అల్లాహ్ను విశ్వసించడం, 5 పర్యాయాలు నమాజ్, జీవితంలో ఒక్కసారైనా మక్కా సందర్శన. వీటిలో చివరి నియమాన్ని పాటించే నేపథ్యంలో జరుపుకునే పండుగే బక్రీద్. నేడు ఘనంగా ఈద్–ఉల్–అద్హా నిర్వహణకు ఏర్పాట్లు ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేయనున్న ముస్లింలు సర్వమానవాళి కోసం దువా చేయనున్న మతపెద్దలుత్యాగాల పండుగ బక్రీద్ బక్రీద్ పండుగ మనిషికి దైవ భీతిని, త్యాగ నిరతిని తెలియజేస్తుంది. అందుకే ఈ పండుగను త్యాగాల పండుగ అంటారు. చనిపోయిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని వారి పేరున పొట్టేలు మాంసాన్ని ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో ఉంటూ సన్మార్గంలో నడవాలని బక్రీద్ పండుగ తెలియజేస్తుంది. –కోలా అమీర్బాషా, రైస్ మర్చంట్, కదిరి -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి బలవన్మరణం
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యాన్ని తాళలేక ఇద్దరు, కుటుంబసభ్యులు తన బాగోగులు చూడడం లేదన్న బాధతో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. సోమందేపల్లి: మండలంలోని ఓబుళదేవరపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య(80) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం భార్య మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న లక్ష్మయ్య... తనకున్న ముగ్గురు కుమారులు బాగోగులు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లోనే పైకప్పుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎన్పీకుంట: మండలంలోని పెడబల్లి గ్రామానికి చెందిన వివాహిత మల్లిక (28) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తాళలేక ఊయల వేసిన చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫాతిమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. కాగా మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెనుకొండ: స్థానిక రైల్వే రోడ్డు మార్గంలో నివాసముంటున్న చాకలి శివయ్య (66) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా ఆయన క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ఇంట్లోనున్న కత్తి తీసుకుని రైల్వే బ్రిడ్జి కిందకు చేరుకుని గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం దుర్వాసన రావడంతో పాటు స్థానికులు అటుగా వెళ్లి చూశారు. కుళ్లిన మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. సమాచారం అందుకున్న ఎస్హెచ్ఓ దాదాపీర్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ఆవేదనతో ఆగిన గుండె
హిందూపురం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక అన్నాహారాలు మాని అనారోగ్యానికి గురైన చలివెందుల గ్రామానికి చెందిన ఉమేష్ (36) మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు... ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఉమేష్ తీవ్రంగా కుమిలిపోతూ ఆహారం తినక అనారోగ్యం పాలయ్యాడు. ఈ క్రమంలోనే తనకు తారసపడిన గ్రామస్తులతో సక్రమంగా మాట్లాడేవాడు కాదు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హిందూపురం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆదివారం మృతుడి భార్య వాణి, ఆరేళ్ల వయసున్న కుమారుడు వరుణ్, నాలుగేళ్ల వయసున్న కుమార్తె పూజను పరామర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కాగా, ఉమేష్ మృతిపై గ్రామ సర్పంచ్ ఉపేంద్రరెడ్డి సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన వైనం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీఎన్ దీపిక -
ధర్మవరానికి చేరుకున్న సైనికుల బైక్ ర్యాలీ
ధర్మవరం అర్బన్: కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల సేవలను స్మరించుకునేలా ఆర్మీ జవానులు చేపట్టిన బైక్ ర్యాలీ ఆదివారం ధర్మవరం మండలం రేగాటిపల్లికి చేరుకుంది.ఇండియన్ ఆర్మీ సౌత్ డెల్టా ఫైర్ ఎక్స్పిడిషన్ కెప్టెన్ ఆదర్శ్జమేధ, మనోజ్నాయక్ నేతృత్వంలో బ్రిగేడియర్ అజయ్కుమార్ ఠాకూర్ సారథ్యంలో తమిళనాడులోని ధనుష్కోటి నుంచి ర్యాలీ చేపట్టినట్లుగా సైనికులు తెలిపారు. కార్గిల్ యుద్ధం ముగిసి నేటికి పాతికేళ్లు అయిందని, ఈ నేపథ్యంలో కార్గిల్ అమరుల త్యాగాలను స్మరించుకునేలా లద్ధాఖ్ వరకూ 5వేల కిలోమీటర్లు మేర బైక్ ర్యాలీ కొనసాగుతుందన్నారు. వచ్చే నెల 9న కార్గిల్ యుద్ధ స్మారకాన్ని చేరుకోవడంతో ర్యాలీ ముగుస్తుందని వివరించారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ధర్మవరం అర్బన్: స్థానిక రైల్వేస్టేషన్లో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. వివరాలు.. ధర్మవరంలోని తారకరామాపురానికి చెందిన నాగరాజు (42) రైళ్లలో తిరుగుతూ తినుబండారాల విక్రయం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తినుబండారాలను తీసుకుని స్థానిక రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆయన అప్పటికే ప్లాట్ఫాం నుంచి బయలుదేరిన తిరుపతి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో కాలు జారడంతో రైలు బోగికి ప్లాట్ఫాంకు మధ్యలో చిక్కుకుని తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అంతర పంటలు అన్నివిధాలా మేలు
అనంతపురం అగ్రికల్చర్: వర్షాధారంగా కేవలం ఒకట్రెండు పంటలను నమ్ముకోకుండా మధ్యమధ్యలో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలకు చెందిన అంతర పంటలు వేసుకోవడం వల్ల మెట్ట వ్యవసాయం లాభసాటి అవుతందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. విస్తారంగా వర్షాలు నమోదైన నేపథ్యంలో ఖరీఫ్ పంటలు విత్తుకునేందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. వివరాలు వారి మాటల్లోనే.. ● తేలికపాటి నేలల్లో వాలుకు అడ్డంగా దుక్కి చేసుకుని తర్వాత పంటలు విత్తుకుంటే నేలతో తేమశాతం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వర్షాధారంగా అంతర పంటలు తప్పనిసరిగా వేయాలి. ఆరుతడి పంటలకు బోదే లేదా సాళ్లు లేదా ఎత్తుమడుల పద్ధతిలో విత్తుకోవాలి. ఒకవేళ ఎక్కువ వర్షాలు వచ్చినా నీటిని బయటకు పంపడానికి అవకాశం ఉంటుంది. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టడానికి వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర విత్తనాలను తెగుళ్ల మందుతో విత్తనశుద్ధి (సీడ్ ట్రీట్మెంట్) చేసుకోవాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ దగ్గరదగ్గరగా ఒత్తుగా లేకుండా ప్రతి పంటలోనూ మొక్కల సాంద్రత పాటించాలి. ● వేరుశనగ సాగు చేసే రైతులు పొలాన్ని రెండు మూడు సార్లు దుక్కి చేసుకోవాలి. జూలై మాసం అంతా విత్తుకునేందుకు అనుకూలం. కే–6, కే–9, కదిరి హరితాంధ్ర, అనంత, ధరణి, కదిరి–లేపాక్షి, టీసీజీఎస్–1694 లాంటి విత్తన రకాలు అనువుగా ఉంటాయి. ఎకరాకు 50 నుంచి 60 కిలోలు విత్తనం అవసరం. విత్తే ముందు కిలో విత్తనానికి 1 మి.లీ ఇమిడాక్లోప్రిడ్తో శుద్ధి చేసిన తర్వాత ఒక గ్రాము టిబుకొనజోల్ అలాగే 10 గ్రాము ట్రైకోడెర్మావిరిడీతో విత్తనశుద్ధి పాటించాలి. వేరుశనగ పొలం చుట్టూ రక్షణ పంటలుగా సజ్జ, జొన్న నాలుగు నుంచి ఆరు వరసలు విత్తుకుంటే కాండం కుళ్లు, వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగులు, తామరపురుగులను నివారించవచ్చు. 7 : 1 లేదా 11 : 1 లేదా 15 : 1 నిష్పత్తిలో వేరుశనగలో కంది లేదా సజ్జ పంటలు వేసుకోవాలి. విత్తే సమయం లేదా విత్తిన తర్వాత 20 నుంచి 30 రోజుల సమయంలో నీటి సంరక్షణ కోసం ప్రతి 3.6 మీటర్లకు ఒక తల్లిచాటు ఏర్పాటు చేసుకోవాలి. ● కంది సాగు చేసే రైతులు తేలికపాటి నేలల్లో మధ్యస్థ రకాలైన పీఆర్జీ–176, పీఆర్జీ–158, ఐసీపీఎల్–84031 విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. బరువు నేలల్లో ఎక్కువ కాలపరిమితి రకాలైన ఎల్ఆర్జీ–41, ఎల్ఆర్జీ–52, , ఎల్ఆర్జీ–105, టీఆర్జీ–59, ఐసీపీఎల్–85063, ఐసీపీఎల్–87119, బీఎస్ఎంఆర్ –786 రకాలు ఎంపిక చేసుకోవాలి. ● పత్తి విషయానికి వస్తే... ఎర్రనేలల్లో జూన్ నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. నల్లరేగడి భూముల్లో జూలై నుంచి ఆగస్టు 15 వరకు విత్తుకునేందుకు అనుకూలం. ఒక ప్రాంతంలో ఉన్న రైతులంతా దఫాలుగా కాకుండా వీలైతే స్వల్ప వ్యవధిలో ఒకేసారి విత్తుకుంటే తెగుళ్లు, చీడపీడల నివారణకు సులభమవుతుంది. బీటీ రకం విత్తనాలు ఎకరాకు 750 గ్రాములు నుంచి ఒక కిలో అవసరం. బీటీ రకం వేసుకుంటే పొలం చుట్టూ నాన్ బీటీ పత్తి లేదా కంది వేసుకుంటే కాయతొలచు పురుగు ఉధృతిని అరికట్టవచ్చు. విత్తుకున్న 40 రోజులకు తప్పనిసరిగా ఎకరాకు 4 నుంచి 6 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా వేసుకున్న ప్రాంతాల్లో పత్తి పంట ప్రస్తుతం మొలకదశలో ఉంది. ఈ వాతావరణానికి వేరుకుళ్లు తెగులు సోకే అవకాశం ఉన్నందున 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి మొక్క వేరుమండలం తడిచేలా పోయాలి. ఈ సమస్య నివారణకు విత్తే సమయంలో కిలో విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడెర్మావిరిడీతో విత్తనశుద్ధి చేసుకోవాలి. ● ఆముదం పంట విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై 31 వరకు అనుకూలం. హరిత, కిరణ్, జ్వాల, ప్రగతి లాంటి సూటి రకాలు అలాగే డీసీహెచ్–117, పీసీహెచ్–111, జీసీహెచ్–8, ఐసీహెచ్–66, ఐసీహెచ్–5 లాంటి హైబ్రీడ్ విత్తన రకాలు అనువుగా ఉంటాయి. ● వరి నారు మడులు పెంచుకునేందుకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు అనుకూలం. సాంబమసూరి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోనా, నెల్లూరి మసూరి, నంద్యాల సోనా, ఎంటీయూ–1212, ఎంటీయూ–1280, ఎంటీయూ–1281 లాంటి రకాలు బాగుంటాయి. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణకు నారుపోసే ముందు కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజమ్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వాలుకు అడ్డంగా దున్ని విత్తుకుంటే తేమశాతం పెరుగుదల విత్తనశుద్ధి, మొక్కల సాంద్రత, కలుపు నివారణతోనే లాభసాటి తెగుళ్ల నివారణకు వేరుశనగ, పత్తి చుట్టూ రక్షణ పంటలు వేయాలి ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు బి.సహదేవరెడ్డి, జి.నారాయణస్వామి వెల్లడి -
వజ్రమా.. వరించుమా!
రాయలు కాలంలో వజ్రాలు రాసులు పోసి అమ్మేవారని చెబుతుంటారు. రత్న గర్భంగా పేరొందిన రాయలసీమ భూముల్లో వజ్రాలు లభిస్తాయనేది ప్రజల నమ్మకం. ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చినప్పుడు భూమి పొరల్లోంచి వజ్రాలు బయటపడతాయని, చాలా మందికి దొరికాయని విస్తృతంగా ప్రచారం సాగింది. ఇంకేముంది ఔత్సాహిక జనం వజ్రాల కోసం ధర్మవరం మండలం చిగిచెర్ల పంట పొలాలకు క్యూ కడుతున్నారు. ధర్మవరం : వర్షాకాలం వచ్చిందంటే చాలు ధర్మవరం – చిగిచెర్ల ప్రధాన రహదారి సమీపంలో జనం గుంపులు గుంపులుగా కనిపిస్తుంటారు. అందుకు కారణం ఆ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం ఊపందుకోవడమే. దీని గురించి సమాచారం తెలిసిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, తొందరగా లక్షాధికారులు అయిపోదామని భావించే వారు వజ్రాన్వేషణకు వచ్చేస్తున్నారు. చిగిచెర్ల వద్ద కందుకూరు కెనాల్కు ఆనుకుని ఉన్న పంట పొలాలకు చిన్న, పెద్ద తేడా లేకుండా వెళ్తుంటారు. సూక్ష్మ రేణువులను సైతం వదలకుండా భూతద్దం ఇతర పరికరాల ద్వారా నిశితంగా పరిశీలిస్తుంటారు. ధర్మవరం నియోజకవర్గంతో పాటు గుత్తి, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రజల వీటి కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. చాలా ఏళ్ల కిందట ఇక్కడ పంట పొలాల్లో వజ్రాల కోసం పలు పరిశోధనలు జరిగాయి. అయితే వజ్రాలు ఉన్నట్లుగా చూపే ఆధారాలేవీ బహిర్గతం కాలేదు. ఉత్సాహంగా అన్వేషణ పంట పొలాల్లోకి చేరిన జనాలు మట్టిని పెకలిస్తూ కనిపించిన ప్రతి రాయినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. కాంతివంతమైన రాయి కనిపిస్తే చాలు అది వజ్రమేనేమోనన్న ఆనందంలో కేరింతలు కొడుతున్నారు. వారికి వారే అది వజ్రం కాదు.. సాధారణ రాయేనని చర్చించుకోవడం.. తిరిగి ఆశతో అన్వేషణ కొనసాగించడం పరిపాటిగా మారుతోంది. విభిన్నంగా ఉన్న రాళ్లు వజ్రమా లేక రంగు రాయా అన్నది పరీక్షల్లోనే తేలనుంది. ఇప్పటి వరకు వజ్రం పలానా వారికి దొరికింది అన్న వివరాలేమీ లేవు. అయినా సరే జనం ఆశతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు వజ్రం లభించకపోతుందా అని అలుపెరగకుండా అన్వేషిస్తూనే ఉన్నారు. వజ్రాల కోసం అన్వేషణ షురూ.. వర్షాకాలమొస్తే చాలు అందరూ చిగిచెర్లకే భూమిపొరల్లోంచి వజ్రాలు బయటపడతాయని నమ్మకం అలవాటైపోయింది చిగిచెర్ల పొలాల్లో వజ్రాలు దొరుకుతాయన్న ప్రచారం నా చెవినపడినప్పటి నుంచి నేను ఇక్కడకు వచ్చి వెదుకుతున్నాను. వర్షాకాలంలో చాలాసార్లు వెదికినా ఇప్పటి వరకు అదృష్టం వరించలేదు. అయిన్పటికీ ప్రయత్నం విరమించలేదు. నేనొక్కడినే కాదు ఇక్కడికి ఇతర జిల్లాల వారు కూడా వాహనాల్లో వచ్చి వెతుకుతుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. – సర్దార్, ధర్మవరం పొలాలు నాశనం చేయొద్దు మా పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని విస్తృత ప్రచారం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తొక్కుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నారు. దీంతో మేమంతా పనులు మానేసి కాపలా ఉండే పరిస్థితి నెలకొంది. దయచేసి ఎవ్వరూ మా పంటపొలాల్లోకి రావొద్దు. – చంద్రప్ప, రైతు, చిగిచెర్ల -
భక్తులతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. శనివారం వేకువజామునే స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు అనంతరం స్వర్ణ వజ్రకవచ అలంకరణలో స్వామివారిని తీర్చిదిద్ధి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేపట్టిన ఆలయ సిబ్బంది వారికి అన్నదానం చేపట్టారు. -
రాకెట్లలో సినిమా షూటింగ్ సందడి
ఉరవకొండ: రాకెట్ల గ్రామంలో హిట్ మ్యాన్ అండ్ ప్రోమోస్ ప్రొడక్షన్ సినిమా యూనిట్ శనివారం సందడి చేసింది. గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పక్కన ఎంపిక చేసిన రైతు ఇంట్లో షూటింగ్ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ఇంద్రప్రస్థా పేరుతో నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ నటుడు ఆదిపినిశెట్టి, చైతన్యకృష్ణ హీరోలుగా నటిస్తున్నారు. 1970, 1980లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈనెల 20 వరకూ ఆమిద్యాల, తగ్గుపర్తి, వెంకట్రాదిపల్లి గ్రామాల్లో షూటింగ్ జరుపుకోనుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
టీబీ డ్యాంలో 6 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: జిల్లా ప్రజలకు హెచ్చెల్సీ (ఎగువ) కాలువ ద్వారా తాగు, సాగు నీరందించే కర్ణాటకలోని హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. శనివారం జలాశయంలో 6.024 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మే నెలఖారు వరకు డ్యాంకు ఇన్ఫ్లో లేదు. కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండేది. అయితే కొన్ని రోజులుగా డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, ఆగుంబే, తీర్ధనహాళ్లి, వరనాడు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 1,676 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. అవుట్ఫ్లో 301 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ప్రసుత్తం జలాశయంలో 1,582.89 అడుగులకు నీరు చేరుకుంది. మొత్తం సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.024 టీఎంసీల నీరు ఉంది. వర్షాలు కొనసాగుతుండడంతో ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 1,581 అడుగుల వద్ద 4.975 టీఎంసీల నీరు నిల్వ ఉండిందని వెల్లడించారు. అందరి సహకారంతోనే ఎన్నికలు విజయవంతం ● సిబ్బందికి అభినందనలు తెలిపిన ఎస్పీ మాధవరెడ్డి పుట్టపర్తి టౌన్: పోలీసు సిబ్బంది అందరి సహకారంతో సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. శనివారం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో అత్మీయ సమావేశం నిర్వహించి.. 60 మంది పోలీసులకు ప్రశంసాపత్రాలు, రివార్డులను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో పోలీస్ సిబ్బంది ఎన్నికల నియమావళికి అనుగుణంగా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. పోలీస్ సిబ్బంది సమష్టిగా విధులు నిర్వర్తించడంతో నామినేషన్ ప్రక్రియ నుంచి కౌటింగ్ వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. చెక్పోస్టుల్లో సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వహించారని, సెబ్ అధికారులు పూర్తిగా నిఘా పెట్టడం వలన కర్ణాటక లిక్కర్, నగదు వంటి వాటికి అడ్డుకట్ట వేయగలిగామన్నారు. ఎలక్షన్ సెల్ ఎస్బీ శాఖ అప్రమత్తంగా పనిచేస్తూ ప్రతి సమాచారం ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కు అందిచామన్నారు. ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చూడగలిగామన్నారు. ఎన్నికల సమయంలో సమర్థవంతగా విధులు నిర్వహించడంతో రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరు వచ్చిందన్నారు. ఎన్నికల విజయవంతంలో మీ కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విష్ణు, సెబ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణ, ఈఎస్ సుబ్రమణ్యం, సీఐలు బాలసుబ్రమణ్యం రెడ్డి, విక్రమ్, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నాన్న ఆశయం నెరవేర్చా
మా నాన్న శంకర్ నగరంలో ఓ హోటల్ నడుపుతున్నారు. నన్ను పెద్ద క్లాసికల్ డ్యాన్సర్ను చేయాలనేది ఆయన కల. నా చిన్నప్పటి నుంచి అదే చెప్పేవారు. నాకు మా నాన్నంటే ఎంతో ఇష్టం. ఆయన కోసం అదే ఇష్టాన్ని శాసీ్త్రయ నృత్యంపై పెట్టి మెలకువలు నేర్చుకున్నా. ప్రముఖ నాట్యాచార్యులు సంధ్యామూర్తి నేతృత్వంలో జాతీయస్థాయితో పాటు దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చా. నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడల్లా నాన్నే గుర్తొస్తారు. దీంతో కష్టమనేది అనిపించదు. పెళ్లి తర్వాత కూడా మా అత్తారింటి వారికి నాన్న ఆశయం నెరవేర్చాలని చెప్పా. వారు కూడా ఎంతో సహకరిస్తున్నారు. – మహాలక్ష్మి, శాసీ్త్రయనృత్య కళాకారిణి, అనంతపురం -
18న కేవీకేలో రైతు సదస్సు
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 18న రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు కేవీకే కో ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి పేర్కొన్నారు. ‘పీఎం కిసాన్ సమాన్ నిధి’ నిధుల విడుదల సందర్భంగా వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కార్యక్రమాన్ని రైతులకు వీక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 22న హెచ్సీఎల్ టెక్బీ కెరీర్ ప్రోగ్రాంకు ఎంపిక అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ,హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్తంగా హెచ్సీఎల్ టెక్బీ కెరీర్ ప్రోగ్రాం ద్వారా ఈ నెల 22న అనంతపురం ప్రభుత్వ ఐటీఐ (బాయ్స్ ) కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్కుమార్ తెలిపారు. 2023–2024కు 70 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్ లేదా బిజినెస్ మ్యాథ్స్లో 60 కంటే ఎక్కువ శాతంతో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. నాన్ ఐటీ రంగంలో 2023–2024లో 70 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతతో ఇంటనర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా హెచ్సీఎల్ టెక్బీ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ 2023–2024లో పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపస్ డ్రైవ్కు రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, (పదో తరగతి, ఇంటర్మీడియట్), రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రావాలన్నారు. వివరాలకు 6363095030, 8555085030 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నెల్లూరు, చిత్తూరు జట్ల విజయం అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–23 సౌత్ జోన్ టోర్నీలో భాగంగా నిర్వహిస్తున్న మ్యాచ్ల్లో శనివారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల జట్లు విజయం సాధించాయి. ● నెల్లూరుతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి కర్నూలు బ్యాటింగ్ ఎంచుకుంది. 27.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 23.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 125 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ● చిత్తూరుతో జరిగిన మ్యాచ్లో కడప టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 220 పరుగులు సాధించింది. ఎం.వాసుదేవరాజు 89 బంతుల్లో 50 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్), విజయరామిరెడ్డి 75 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్లు)66 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు 40.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి గెలుపొందింది. ధరణి కుమార్ 68 బంతుల్లో 57 పరుగులు (నాలుగు ఫోర్లు), రెడ్డి రుషిల్ 86 బంతుల్లో 104 పరుగులు (9ఫోర్లు, 6 సిక్స్లు) ధాటిగా ఆడి జట్టు విజయానికి కృషి చేశారు. సెంచరీ హీరో రెడ్డి రుషిల్ -
ఉచిత విద్య మిథ్యే
కదిరి: జిల్లాలో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు చట్టం నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. పకడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండం విమర్శలకు తావిస్తోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం కోటా సీట్లు ఉచితంగా ఇవ్వాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. అమలు చేసి తీరాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు మాత్రం అమలు చేస్తామని చెప్పడమే కానీ చర్యలు తీసుకోవడం లేదు. విద్యాహక్కు చట్టం 2010 నుంచి అమలులోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 650 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సరాసరిన ప్రతి పాఠశాలలో 30 మంది విద్యార్థులు చొప్పున ఒకటో తరగతిలో చేరుతున్నారు. అంటే సుమారు 20 వేల మంది విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశిస్తున్నారు. అందులో 25 శాతం కోటా ప్రకారం 5 వేల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో ఉచితంగా ప్రవేశం ఇవ్వాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా పేద పిల్లలకు ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. చాలా వరకు అన్ని కార్పొరేట్ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనే అడ్మిషన్లు పూర్తి చేశారు. కాకపోతే విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు రావాల్సిన 25 శాతం కోటా సీట్లు ఎక్కడా అమలు చేయలేదు. 25 శాతం కోటాలోనూ రిజర్వేషన్లు.. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత కోటా సీట్లకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన కూడా ఉంది. ఈ విషయం విద్యాహక్కు చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఆర్థికంగా వెనుకబడిన ఓసీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 6 శాతం, అనాథలు, హెచ్ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం సీట్లు ఇవ్వాలి. ఈ కోటాలో తమ పిల్లలకు ఉచితంగా సీటు సాధించాలంటే తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.60 వేలకు మించరాదు. బియ్యం కార్డు ఉన్న వారు అర్హులు. 25 శాతం సీట్ల అమలుపై జిల్లా విద్యాశాకాధికారి మీనాక్షిని వివరణ కోరితే విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం కోటా పేద పిల్లలకు తప్పకుండా అమలయ్యేలా చూస్తామని చెప్పారు. అలా అమలు చేయని పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమలు కాని విద్యాహక్కు చట్టం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పేదలకందని ఉచిత విద్య దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలూ బేఖాతరు
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ కీలక సమావేశం
టీ20 వరల్డ్కప్లో నేడు (జూన్ 17) మరో ఆసక్తికర సమరం
వరుణ్ సందేశ్ కెరీర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్: నిఖిల్ సిద్దార్థ్
ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్.. కారణం..
న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే
'బంగార్రాజు' బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. చూస్తే అంతే! (ఫొటోలు)
వారెవ్వా సకిబ్.. నాలుగు ఓవర్లు.. 7 పరుగులు! 4 వికెట్లు
ఫైనల్లీ 'కల్కి' సాంగ్ వచ్చేసింది.. అదే కాస్త డిసప్పాయింట్!
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. బీజేపీకి సిద్ధరామయ్య కౌంటర్
ఓటీటీలో 'శర్మాజీ కి బేటీ'.. విడుదల తేదీ వచ్చేసింది
Advertisement