-
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 7 పార్ట్మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 64,080 మంది స్వామివారిని దర్శించుకోగా 25,773 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
రీల్స్ రాజా.. గురజాల
ప్రజల కష్టం తెలిసిన వారు.. పేదల స్వేదం విలువ తెలిసిన వారు.. జవాబుదారీతనంలో బాధ్యతలు నిర్వర్తించేవారు తమ ప్రతినిధిగా చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.. అయితే డబ్బుంటే చాలు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి మరే అర్హత అవసరం లేదని చంద్రబాబు మరోమారు నిరూపించారు. పార్టీ కోసం త్యాగాలను చేసిన వారు.. ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడిన వాళ్లు.. ఏళ్ల తరబడి జెండాలు మోసిన నేతలను గాలికి వదిలేశారు. రూ.కోట్లకు పడగలెత్తడమే ప్రధాన అర్హతగా భావించి.. బెంగళూరు నుంచి ఊడిపడిన గురజాల జగన్మోహన్నాయుడుని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలకు కనీస పరిచయం లేని వ్యక్తిని స్థానిక నేతల నెత్తినపెట్టారు. తీరా ఆయన వ్యవహారశైలి చూస్తే విలువలకు తిలోదకాలిచ్చినట్టే కనిపిస్తోందని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న సదరు అభ్యర్థి వీడియోలు.. రీల్స్ చూసిన టీడీపీ నేతలు సైతం ఇదెక్కడి విపరీతం అంటూ తలలు పట్టుకుంటున్నారు. చిత్తూరు అర్బన్ : టీడీపీ చిత్తూరు ఎమ్మెల్య అభ్యర్థి గురజాల జగన్మోహన్నాయుడు (జీజేఎం) ప్రచారానికి వెళితే రూ.కోట్ల విలువ చేసే వాహనాల శ్రేణి, ఖరీదైన వ్యక్తులు తప్ప సామాన్యులు కనిపించరు. జీజేఎం రోజుకు పట్టుమని అయిదు కిలో మీటర్లు కూడా నడిచి తిరగలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన జీవన శైలి మొత్తం విలాసవంతంగా కనినపిస్తుంది. కష్టపడి పనిచేసే పేదల బతుకు పోరాటంపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. అలాంటిది చిత్తూరు నియోజకవర్గంలో ప్రజల మనన్నలు పొందడం జీజేఎంకు చాలా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా సొంత పార్టీలోని సీనియర్లకు సైతం ఆయన వ్యవహారశైలి నచ్చడంలేదనే విమర్శలున్నాయి. ఇటీవల పార్టీలోకి వచ్చిన ఓ సీనియర్ నాయకుడి అనుచరులు తన ప్రత్యర్థతో మాట్లాడుతున్నారా...? అని ఆరా తీయడం వాళ్లకు తెలిసి పోయి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పారీ్టలో కురువృద్ధుడిగా ఉన్న వ్యక్తిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోవడం ఖాయమని, అందుకే తన ప్రణాళికలు తనకు ఉన్నట్లు సన్నిహితులతో చెప్పుకుంటున్నట్లు టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఇక టికెట్ రాకపోవడంతో నిస్తేజంలో ఉన్న టీడీపీలోని కాపు నాయకులను అస్సలు నమ్మడంలేదని, వీళ్ల వల్ల తనకు వంద ఓట్లు కూడా పడవని జీజేఎం ఓ యువ నేత వద్ద అన్నట్లు తెలుస్తోంది. తాను కేవలం క్షేత్రస్థాయిలో ఓటర్లను నమ్ముతానే తప్ప, వెన్నంటే ఉంటూ తనపై బురదజల్లేవారిని నమ్మడంలేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. 20 ఏళ్లల్లో ఎపుడూ చిత్తూరులో కనిపించని వ్యక్తి, రేపు ఎన్నికల్లో ఓడిపోతే, బెంగళూరుకు వెళ్లిపోకుండా స్థానికంగా అందుబాటులో ఉంటారని ఎలా నమ్మగలమని సామాన్య కార్యకర్తలు అనుమానిస్తున్నారు. అడ్డదిడ్డంగా వీడియోలు..! సామాజిక మాధ్యమాల్లో జీజేఎం చేసిన రీల్స్, వీడియోలను చూస్తుంటే కొందరు నవ్వుకుంటుంటే, మరికొందరు అసహ్యించుకుంటున్నారు. ఇటీవల వైరల్గా మారిన ఆయన వీడియోలు చూసిన ప్రజలు ఇదెక్కడి వేషాలు బాబోయ్ అని మండిపడుతున్నారు. వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. ► బైకు నడిపేటపుడు హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినా ప్రాణహాని ఉండదు. పైగా వేగంగా బైకును పోనిచ్చి, రెండు చేతులు వదిలేస్తూ స్టంట్లు చేస్తే..? కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. పైగా ప్రభుత్వ రహదారులపై ఇలాంటివి చేసేపుడు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నది నిబంధన. కానీ చిత్తూరు టీడీపీ అభ్యర్థి ఈ నిబంధనలను తుంగలో తొక్కి బైకు వేగంగా నడుపుతూ, రెండు చేతులు వదిలేసి స్టంట్లు చేసే వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడం విమర్శలకు దారితీసింది. ► మరొక వీడియోలో మహిళలతో కలిసి జీజేఎం రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తూ యువతకు ఏం సందేశమిస్తున్నారని చిత్తూరు వాసులు ప్రశి్నస్తున్నారు. ► ఇంకొక వీడియోలో తనకు అంగరక్షులు ఉన్నారనే అర్థం వచ్చేలా ఇద్దరు వ్యక్తులకు పొడవాటి తుపాకులు ఇచ్చి వాటిని కూడా వీడియో తీసి పెట్టాడు. ఈ వీడియో ఎక్కడ తీశారో..? అసలు అందులో కనిపిస్తున్న అంగరక్షకుల వద్ద ఉన్న తుపాకులకు లైసెన్స్ ఉందా.? కాల పరిమితి అయిపోయిందా..? అనే వివరాలు తెలియడంలేదు. దీని ద్వారా తానో డాన్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ► ఇటీవల చిత్తూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావుతో కలిసి ప్రచారానికి జీజేఎం వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మహిళలతో మాట్లాడారు. తాను ఎక్కడికి వెళ్లినా నీళ్లు లేవు, రోడ్లులేవు అంటున్నారని, ఇక్కడ నేను కాదు కదా ఉండేది.. ఇచ్చేది అని దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో చిత్తూరు వాసులు ఈయనకు ఓటేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
పచ్చపార్టీ ప్రలోభాలు
సాక్షి, చిత్తూరు/చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్/గిద్దలూరు రూరల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో ఓటర్లకు ప్రలోభాల వల విసురుతున్నారు. ఓవైపు మనీ.. ఇంకోవైపు మద్యం పంపిణీ చేస్తూ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. ముందుగానే ఓటమి ఖాయం కావడంతో కాస్తయినా పరువు నిలుపుకోవాలనే ఉద్దేశంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం, నగదు, గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు చాలా సులువుగా అక్కడి మద్యాన్ని సరిహద్దులు దాటిస్తూ డంప్ చేస్తున్నారు. బుధవారం చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గురజాల జగన్మోహన్, ప్రసాదరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీకు వచ్చినవాళ్లకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నగదు, పెద్ద ఎత్తున మద్యం అందజేశారు. పలమనేరు నీటిపారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న కుమారస్వామి అనే వ్యక్తి ‘పచ్చ’ జెండాలు మోస్తూ ఇప్పటికే సస్పెండ్ అయ్యాడు. అయితే మళ్లీ తాజాగా చిత్తూరు రూరల్ మండలంలో జనసమీకరణ చేసి టీడీపీ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు ద్విచక్ర వాహనాలుప్రధాన నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు రూ.లక్షలు విలువ చేసే బుల్లెట్లు, ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీకి టీడీపీ అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో పాల వ్యాపారం చేసే వారికి ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు ఉచితంగా ఇచ్చారు. వాటికి టీడీపీ స్టిక్కర్లు అంటించి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఖర్చులు కూడా అభ్యర్థులే భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవిగో ప్రలోభాలు..♦ చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లక్ష్మీపురం, ముత్తుకూరుల్లో ప్రచారం సందర్భంగా టీడీపీ నేతలు కర్ణాటక మద్యాన్ని పంపిణీ చేశారు. ఈ రెండు చోట్ల దాదాపు రూ.80 వేలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.♦ ఇటీవల చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు రూరల్ మండలంలో పిల్లలకు పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ♦ పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో షాదీమహల్ వద్ద రంజాన్ పర్వదినం ముందు రోజు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ తరఫున ముస్లింలకు టీడీపీ గుర్తులతో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ♦ గంగాధర నెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్ తాయిలాల పంపిణీలో స్పీడ్ పెంచారు. రెండు రోజుల ముందు శ్రీరంగరాజపురం మండలం కటికపల్లిలో నిత్యావసర వస్తువులతోపాటు చీర, జాకెట్, ప్యాంటు, చొక్కా, మద్యం బాటిల్, రూ.500 నగదు కిట్గా పంపిణీ చేశారు. ♦నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ క్వారీల రాజకీయానికి తెరతీశారు. తమ పార్టీలోకి వస్తే క్వారీలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. మరికొందరికి డీకేటీ భూములు కూడా ఇస్తామని అలవికాని హామీలు ఇస్తున్నారు. ఇక పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ♦టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ తాయిలాలు ఊపందుకున్నాయి. ఇటీవల చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కుప్పంలోని 243 పోలింగ్బూత్ల్లో ఒక్కో చోట రూ.30 వేల చొప్పున పంపిణీ చేశారు. అలాగే జనసమీ కరణ కోసం ఒక్కొక్కరికి రూ.300 నగదు, మద్యం సీసా, బిర్యానీ అందజేశారు.♦ ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి నామినేషన్ పర్వంలో ఓటులేని వారి చేతికి టీడీపీ జెండా ఇచ్చి మరీ ప్రచారం చేయించారు. ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి నామినేషన్కు నియోజకవర్గంలోని గ్రామాల్లో నుంచి జనాన్ని తరలించారు. నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులై పారింది. -
సీఐపై దాడికి టీడీపీ నేతల యత్నం
గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్నాయుడు, మరికొందరు నేతలు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలులో భాగంగా మంగళవారం ఆర్వో కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం విధుల్లో ఉన్న సీఐ శంకర్ అలా వెళ్లకూడదని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జయశంకర్నాయుడు ‘నన్నే అడ్డుకుంటావా.. వచ్చేది మా ప్రభుత్వం నీ అంతు చూస్తా నా..’ అంటూ సీఐపై బూతు పురాణంతో విరుచుకు పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దూషణకు దిగి సీఐ డౌన్డౌన్ అంటూ నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు. తన్నుకున్న తమ్ముళ్లు.. ర్యాలీ కోసం 30 బస్సుల్లో జనాన్ని పోగుచేసి రూ.3 వందలు, మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్ పంపిణీ చేసినట్లు తెలిసింది. తీసుకొచ్చిన జనానికి మందుబాటిళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుటే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలతో కొట్టుకున్నారు. అదేవిధంగా ఫొటోగ్రాఫర్లకు అనుమతి లేని రిటరి్నంగ్ కార్యాలయం ఆవరణంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి తెలుగు తమ్ముళ్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. -
పుంగనూరులో నల్లారి ప్లాప్ షో
● కూటమి అభ్యర్థుల సభకు జనం కరువు ● తెలుగుదేశం నేతల కోడ్ ఉల్లంఘన ● బాణసంచా హోరు ● జనాలకు మద్యంగంటల కొద్దీ జనం కోసం.. టీడీపీ అభ్యర్థి చల్లాబాబు బాలాజీ థియేటర్ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి ఎంబీటీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు నానాతంటాలు పడ్డారు. పలువురు శాపనార్థాలు పెట్టడం కనిపించింది. ర్యాలీకి జనం రాకపోవడంతో ముందుగా బాణసంచా భారీ ఎత్తున కాల్చారు. అలాగే డీజే పాటలు, డ్యాన్స్లతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. ర్యాలీకి వచ్చిన అద్దె జనానికి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద షామియానాలు వేసి భోజనాలు ఏర్పాటు చేశారు. మండుటెండలో తాగునీరు లేక, భోజనం రుచిగా లేకపోవడంతో ప్రజలు తినకుండా అక్కడే పడేసి వెళ్లడం కనిపించింది.పుంగనూరు: కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సోమవారం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డి పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బాణసంచా పెద్ద ఎత్తున కాల్చా రు. డీజేపాటలు పెట్టి డ్యాన్సులు చేశారు. మద్యాన్ని విచ్చలవిడిగా తాగించారు. ఆపై భోజనం రుచిగా లేదంటూ అద్దెజనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కట్టుకథల కిరణ్ కూటమి అభ్యర్థుల సభ జనం లేక వెలవెలబోయింది. తొలుత చల్లా రామచంద్రారెడ్డి ప్రసంగిస్తుండగా జనం వెళ్లి పోతుండడంతో కిరణ్కుమార్రెడ్డి మైకు అందుకుని మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆయన పలు విమర్శలు చేశారు. పాల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇదేంటి కిరణ్ ఇలా మాట్లాడుతున్నారంటూ గుసగుసలాడడం కనిపించింది. రూ.300, క్వార్టర్ అద్దె జనానికి భారీగా నగదు, మద్యం పంపిణీ చేసినట్టు ఆయా పార్టీల కార్యకర్తలే చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.300, క్వార్టర్ బాటిల్, బిరియానీ అందజేశారు. మద్యం షాపుల వద్ద టీడీపీ జెండాలు చేతబట్టిన కార్యకర్తలు కిక్కిరిసిపోయారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement