రోడుపక్కన ప్రజలు.. కాన్వాయ్‌ ఆపిన రాహుల్‌ | Sakshi
Sakshi News home page

రోడుపక్కన ప్రజలు.. కాన్వాయ్‌ ఆపిన రాహుల్‌

Published Mon, Jun 10 2019 7:18 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డుమధ్యలో అకస్మాత్తుగా తన కాన్వాయ్‌ ఆపి.. తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఆశ్చర్యపరిచారు. తనను ఎంపీగా గెలిపించినందుకు కృతజ్ఞతగా వయనాడ్‌లో రాహుల్‌గాంధీ ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. ‘థాంక్స్‌ గివింగ్‌ టూర్‌’ పేరిట ఈ సందర్భంగా చేపట్టిన రోడ్‌షోలో ఆయన వయనాడ్‌ ప్రజలను కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఓ చోట రోడ్డుపక్కన గుమిగూడి.. తన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రజలను గుర్తించిన రాహుల్‌.. తన వాహనాన్ని మధ్యలోనే  ఆపి.. నేరుగా వారి వద్దకు వెళ్లారు. 

Advertisement
Advertisement