భారత్‌ స్పేస్‌ పవర్‌గా అవతరించింది | Sakshi
Sakshi News home page

భారత్‌ స్పేస్‌ పవర్‌గా అవతరించింది

Published Wed, Mar 27 2019 1:56 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం జాతి నుద్దేశించి ప్రసంగించారు. ముందుగానే కీలక ప్రకటన చేయనున్నానని  మోదీ ప్రకటించిన  సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ ప్రపంచంలో అంతరిక్ష రంగంలో సత్తా చాటిన భారతదేశం స్పేస్ సూపర్‌ పవర్‌గా మారిందన్నారు. ఈ సందర్భంగా  దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా, రష్యా , చైనా తర్వాత భారత్ స్పేస్ సెంటర్‌గా ఎదిగిందన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని పేర్కొన్నారు. దేశ భద్రత, టెక్నాలజీ ఎచీవ్‌మెంట్‌లో యాంటి శాటిలైట్‌ వెపన్‌ ఒక  మైలురాయిలాంటిదన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement