అర్థరాత్రి దంచికొట్టిన వాన | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి దంచికొట్టిన వాన

Published Fri, Sep 27 2019 7:55 AM

నగరంలో మరోసారి వర్షం దంచి కొట్టింది. అర్ధరాత్రి నుంచి ఆకస్మికంగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.  లింగంపల్లి, మియాపూర్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, గుడిమల్కాపూర్, రెడ్ హిల్స్, నాంపల్లి, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, కార్వాన్, ఆసిఫ్‌ నగర్ లతోపాటు అనేక ప్రాంతాల్లో 14 సె.మీ నుంచి 10 సె.మీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక కాలనీలోకి నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్ష భీభత్సానికి చాలా ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకొని కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement