-
లాక్ డౌన్లో ఏం జరిగింది?
ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నాలుగైదు సినిమాలు అంగీకరించి, ఫుల్ ఫామ్లో ఉన్నారు అనుపమా పరమేశ్వరన్. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ సరసన అనుపమ నటిస్తున్న చిత్రానికి ‘బైసన్’ టైటిల్ ఖరారు చేసినట్లు సోమవారం యూనిట్ ప్రకటించింది. అనుపమ లీడ్ రోల్లో రూపొందనున్న మరో చిత్రం ‘లాక్ డౌన్’ ప్రకటన కూడా వచ్చింది.ఈ చిత్రాన్ని ప్రకటించి, ‘‘భావోద్వేగాలతో కూడిన కథను చూడ్డానికి సిద్ధం అవ్వండి’’ అంటూ అనుపమా పరమేశ్వరన్ పస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అనుపమ బాధతో అరుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ‘లాక్ డౌన్’లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఈ రేంజ్లో ఎందుకు బాధపడుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది. -
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. నాయక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్ దేశాయ్ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా తన భర్త జగత్ దేశాయ్పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.అమలాపాల్ తన ఇన్స్టాలో రాస్తూ..' నాతో పాటు అర్థరాత్రి వరకు ఉంటూ.. నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అచంచలమైన నమ్మకం.. మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం.. నిజంగా నేను ఏదో అద్భుతమైనా చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కన్నప్పలో ప్రభాస్అయితే కన్నప్ప షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది. -
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
హమరేశ్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన చిత్రం సత్య. ఈ చిత్రాన్ని వాలీ మోహన్దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను శివమ్ మీడియా బ్యానర్పై శివమల్లాల నిర్మించారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి సినిమాగా సత్య నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎనిమిది మంది దర్శకుల చేతుల మీదగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..'హమరేష్ చూడడానికి జీవీ ప్రకాష్ లాగా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ..' సత్య ట్రైలర్ చాల బాగుంది. టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి. అలానే మంచి సక్సెస్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ.' తమిళంలో ఈ సినిమాని నేను రంగోలిగా తీశాను. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తోంది. అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ..'ఈరోజు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నా. కానీ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంఛ్కే ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ప్రొడ్యూసర్ వరకు వచ్చా. నా కెరీర్ ముందు నుంచి సపోర్ట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మే 10న సత్య సినిమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుందరమూర్తి కేఎస్ సంగీతమందించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement