రిటైర్డ్‌ ఉద్యోగులకు నేడు కంటి వైద్యశిబిరం | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఉద్యోగులకు నేడు కంటి వైద్యశిబిరం

Published Fri, Dec 15 2023 1:00 AM

-

నల్లగొండ టూటౌన్‌: తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ (శుక్రవారం) ఉదయం 10గంటలకు నల్లగొండలోని యూటీఎఫ్‌ భవన్‌లో రిటైర్డ్‌ ఉద్యోగులకు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూకల జగదీష్‌చంద్ర, పందిరి శ్యాంసుందర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మ్యాక్స్‌ విజన్‌ శ్రీమహాలక్ష్మీ కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఈ శిబిరానికి రిటైర్డ్‌ ఉద్యోగులు విధిగా హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Advertisement
Advertisement