అమిత్‌షా రోడ్‌ షో కొనసాగిందిలా.. | Sakshi
Sakshi News home page

అమిత్‌షా రోడ్‌ షో కొనసాగిందిలా..

Published Sun, Nov 26 2023 2:06 AM

- - Sakshi

చౌటుప్పల్‌: మునుగోడు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డికి మద్దతుగా చౌటుప్పల్‌ పట్టణంలో శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రోడ్‌ షో నిర్వహించారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో గల ముస్కు మధుసూదన్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు మధ్యాహ్నం 2.20 గంటలకు అమిత్‌ షా చేరుకున్నారు. ఆయనకు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, మునుగోడు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి తదితర నాయకులు స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌ షా ప్రచార రథం పైకి ఎక్కి రోడ్‌ షో ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి తంగడపల్లి, తంగడపల్లి రోడ్డు, జాతీయ రహదారి, బస్టాండ్‌ జంక్షన్‌ నుంచి చిన్నకొండూర్‌ చౌరస్తా వరకు రోడ్‌షో కొనసాగింది. ప్రచార రథంపై నుంచి అమిత్‌ షా అభివాదం చేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. భారత్‌ మాతాకీ జై, జైశ్రీరాం అంటూ ఆయన స్వయంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనూరి వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్‌, అసెంబ్లీ కన్వీనర్‌ దూడల భిక్షం, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోలోజు శ్రీధర్‌బాబు, బీజేపీ మండల, మున్సిపల్‌ అధ్యక్షులు రిక్కల సుధాకర్‌రెడ్డి, ఊడుగు వెంకటేశం, సర్పంచ్‌లు కాయితి రమేష్‌, బాతరాజు సత్యం, నాయకులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, మునగాల తిరుపతిరెడ్డి, ఆలె చిరంజీవి, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, దాసోజు భిక్షమాచారి, పాలకూర్ల జంగయ్య, ఊడుగు యాదయ్య, రమనగోని దీపిక, కడారి కల్పన, కై రంకొండ అశోక్‌, కంచర్ల గోవర్థన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

1/1

Advertisement
Advertisement