Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు

Published Wed, Apr 17 2024 1:10 AM

దుగ్గొండి పీహెచ్‌సీలో రోగులతో మాట్లాడుతున్న 
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ - Sakshi

దుగ్గొండి/ఖానాపురం: వడదెబ్బ బాధితులకు సత్వరం చికిత్స అందించడానికి జిల్లా వ్యాప్తంగా 141 రెస్పాండ్‌ టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ తెలిపారు. 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 118 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందించడానికి రెస్పాండ్‌ టీంలు సిద్దంగా ఉంటాయన్నారు. దుగ్గొండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తొగర్రాయిలోని ఆరోగ్య ఉప కేంద్రం, ఖానాపురం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని మంంగళవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తప్పకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందించాలన్నారు. ఆయన వెంట దుగ్గొండి వైద్యాధికారి కిరణ్‌రాజు, సిబ్బంది సాంబయ్య, వెంకటరమణ, రహమాన్‌, సబిత, ఖానాపురం వైద్యులు జ్యోతి, రాకేష్‌, రుచిత, కల్పన, సిబ్బంది భాస్కర్‌, రాంప్రసాద్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు విజయరాణి, సుజాత, జ్యోతి, రమాదేవి, భార్గవి, జ్యోతి, రమ, ఆశవర్కర్లు ఉన్నారు.

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ

అధికారి వెంకటరమణ

Advertisement
Advertisement