డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.7.91 కోట్ల అభివృద్ధి పనులకు స్థాయీ సంఘ సభ్యులు ఆమోదం తెలిపారు. స్థాయీ సంఘ చైర్పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన బుధ వారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమా వేశం జరిగింది. 23 ప్రధాన అంశాలతో పాటు 13 టేబుల్ అజెండాలు పొందుపరచగా.. 35 అంశాలను సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారని చైర్పర్సన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ రెండో అంశం రెవెన్యూ విభాగానికి సంబంధించి తప్పుడు దస్తావేజులతో ఆస్తిపన్ను విధింపు విషయంలో వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అప్పటి అధికారులపై విచారణ చేపట్టాలని సభ్యులు నిర్ణయించినట్లు చెప్పారు. 22వ అంశంపై సమగ్ర వివరణను మళ్లీ స్థాయీ సంఘానికి తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ వాయిదా వేశామన్నారు. స్థాయీ సంఘ సభ్యులతో పాటు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్, కార్యదర్శి పి.నల్లనయ్య, జోనల్ కమిషనర్లు విజయలక్ష్మి, పి.సింహాచలం, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ పాల్గొన్నారు.
స్థాయీ సంఘ సమావేశంలో
ఒక అంశం వాయిదా